వెండిపై ‘రిచ్‌డాడ్‌ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి సంచలనం | Rich Dad Poor Dad author Robert Kiyosaki says silver set to double its price | Sakshi
Sakshi News home page

వెండిపై ‘రిచ్‌డాడ్‌ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి సంచలనం

Jun 6 2025 8:16 PM | Updated on Jun 6 2025 8:55 PM

Rich Dad Poor Dad author Robert Kiyosaki says silver set to double its price

బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా తారా స్థాయికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 13 ఏళ్ల తర్వాత వెండి ధర ఔన్స్‌కు కొత్త గరిష్టం 35 డాలర్లు దాటింది. 2012 ఫిబ్రవరి తర్వాత వెండి ధర ఇదే అత్యధికం. శుక్రవారం (జూన్‌ 6) 36 డాలర్లకు పైగా ట్రేడ్ అయిన వెండి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రిచ్‌డాడ్‌  పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై సంచలన అంచనాను వెల్లడించారు.

వెండి ధర అకస్మాత్తుగా పెరగడానికి కారణమేమిటో ప్రస్తుతానికి తెలియలేదు.  కానీ చాలా మంది మార్కెట్ విశ్లేషకులు, పరిశ్రమ నిపుణులు ఇది పూర్తిగా 'నిష్పత్తి ట్రేడింగ్' అని పిలుస్తున్నారు. అంటే బంగారం-వెండి నిష్పత్తి 100కు దిగువకు రావడమే వెండి ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.

బంగారం-వెండి నిష్పత్తి అంటే.. 
ఒక ఔన్స్‌ బంగారంతో ఎన్ని ఔన్సుల వెండి కొనొచ్చే తెలిపే ఆర్థిక ప్రమాణాన్ని బంగారం-వెండి నిష్పత్తిగా పేర్కొంటారు. దీని దీర్ఘకాల సగటు 70 కాగా జనవరి నుంచి 100 వద్ద ఉంటూ వస్తోంది. నేడు (జూన్‌ 6న) బంగారం-వెండి నిష్పత్తి 93.33 వద్ద చలించింది. ప్రస్తుతం బంగారం  ధర ఔన్స్‌కు 3,360 డాలర్లు, వెండి ధర 36 డాలర్లుగా ఉంది. బంగారం-వెండి నిష్పత్తిలో ఈ భారీ పతనమే ఇప్పుడు వెండి ధరలను ప్రేరేపించిందని తెలుస్తోంది.

రాబర్ట్ కియోసాకి ఏమన్నారంటే.. 
తన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా ప్రసిద్ధి చెందిన రచయిత, ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి  వెండి, బంగారంపై పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ మధ్య బిట్ కాయిన్‌లపై ఇన్వెస్ట్‌ చేయడాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ప్రస్తుతం వెండి ధర ఔన్స్‌కు 35 డాలర్లను తాకిన తరుణంలో రాబర్ట్ కియోసాకి ఓ సంచలన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "వెండి ఈ రోజు ఉత్తమ బేరం అని నేను నమ్ముతున్నాను. సిల్వర్ ఈ ఏడాది డబుల్‌ అంటే 70 డాలర్లు కావొచ్చని భావిస్తున్నాను'' అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఒక్క రోజే రూ.4వేలు పెరిగిన వెండి

దేశంలో వెండి ధరలు అమాంతం ఎగిశాయి. శుక్రవారం (జూన్‌ 6) ఒక్కరోజే వెండి ధర కేజీకి రూ. 4వేలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో కేజీ వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. మరోవైపు హైదరాబాద్‌ ప్రాంతంలో కేజీ వెండి రూ.4వేలు ఎగిసి రూ.1,17,000లను తాకింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement