దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. పసిడి ధరలు ఆదివారం (జూలై 14) నిలకడగా ఉన్నాయి. ధరల్లో పెరుగుదల లేకుండా స్థిరంగా కొనసాగుతుండటంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది.
ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ. 73,750 వద్ద, అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.67,600 వద్ద ఉన్నాయి. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.67,750 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.73,900 వద్ద ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,050 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.74,240 దగ్గర ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,00,000 వద్ద కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
