Satya Easwaran: విప్రో ఇండియాకు కొత్త హెడ్‌ నియామకం

Former KPMG Executive Satya Easwaran Is New Wipro India Chief - Sakshi

ఇండియా హెడ్‌గా సత్య ఈశ్వరన్‌ బాధ్యతలు

న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ సత్య ఈశ్వరన్‌ను దేశీ బిజినెస్‌ హెడ్‌గా నియమించుకుంది. ఇంతక్రితం కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ సీఈవోగా వ్యవహరించిన ఈశ్వరన్‌ దేశీయంగా కీలక విభాగాలకు అధిపతి(ఇన్‌చార్జ్‌)గా బాధ్యతలు చేపట్టనున్నట్లు విప్రో పేర్కొంది. తద్వారా ఆయన వ్యూహాత్మక కన్సల్టింగ్, ట్రాన్స్‌ఫార్మేషన్, ఆధునికతకు సంబంధించిన ఎంగేజ్‌మెంట్స్‌ తదితర కీలక పారిశ్రామిక విభాగాలలో బిజినెస్‌ను పటిష్ట పరచనున్నట్లు తెలియజేసింది.

విప్రోకు ఇండియా వ్యూహాత్మక మార్కెట్‌కాగా.. సత్య చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు విప్రో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యులు అమిస్‌ సీహెచ్‌ పేర్కొన్నారు. అధిక విలువగల కన్సల్టింగ్‌ సర్వీసుల్లో ఈశ్వరన్‌కున్న అంతర్జాతీయ అనుభవం, సేల్స్‌ విజయాల ట్రాక్‌ రికార్డ్, పటిష్ట నాయకత్వం వంటి అంశాలు దేశీ క్లయింట్లలో విప్రోపట్ల మరింత విశ్వాసాన్ని కల్పిస్తాయని ఆసియా పసిఫిక్, ఇండియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా(ఏపీఎంఈఏ)కు సీఈవోగా వ్యవహరిస్తున్న అమిస్‌ వివరించారు.

క్లౌడ్, డిజిల్, డేటా, అనలిటిక్స్, ఇంజినీరింగ్‌ ఆర్‌అండ్‌డీ, సైబర్‌సెక్యూరిటీ తదితరాలలో విప్రోకున్న సామర్థ్యాలతో క్లయింట్లు ప్రయోజనం పొందేందుకు ఈశ్వరన్‌ సహకరించగలరని అభిప్రాయపడ్డారు.  

చదవండి: ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, మైండ్‌ట్రీ విలీనం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top