సైయంట్‌ చేతికి వర్క్‌ఫోర్స్‌ డెల్టా

Cyient acquiring consultancy firm WorkForce Delta - Sakshi

డీల్‌ విలువ రూ. 21.5 కోట్లు

న్యూఢిల్లీ: కన్సల్టింగ్‌ సంస్థ వర్క్‌ఫోర్స్‌ డెల్టాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయంట్‌ వెల్లడించింది. కంపెనీ విలువను 2.7 మిలియన్‌ డాలర్లుగా (రూ. 21.5 కోట్లుగా) లెక్కగట్టి ఈ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిపింది. తమ అనుబంధ సంస్థ సైయంట్‌ ఆస్ట్రేలియా ద్వారా వర్క్‌ఫోర్స్‌ డెల్టాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని భావిస్తున్నట్లు వివరించింది. మొబైల్‌ వర్క్‌ఫోర్స్‌ నిర్వహణకు సంబంధించి ప్రాసెస్‌ కన్సల్టింగ్‌ నుంచి సొల్యూషన్స్‌ అమలు దాకా సమగ్రమైన సేవలు అందించేందుకు ఈ కొనుగోలు తోడ్పడగలదని సైయంట్‌ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. 2015లో ఏర్పాటైన వర్క్‌ఫోర్స్‌ డెల్టాలో 11 మంది కన్సల్టెంట్లు ఉన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 2.9 మిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top