సెమీకండక్టర్స్కి మెజారిటీ వాటాలు
రూ. 840 కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవర్ మేనేజ్మెంట్ సంస్థ కైనెటిక్ టెక్నాలజీస్లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనున్నట్లు సైయెంట్ సెమీకండక్టర్స్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
ఈ డీల్ విలువ 93 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 840 కోట్లు). 40 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే పవర్ సెమీకండక్టర్ల మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని సీఈవో సుమన్ నారాయణ్ తెలిపారు. అలాగే డేటా సెంటర్లు, ఎలక్ట్రిఫికేషన్, ఆటోమోటివ్, నెట్వర్కింగ్ తదితర విభాగాల్లో విస్తరించేందుకు తోడ్పడనుందన్నారు.


