బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీ వాటాల విక్రయం

Bank of Baroda to sell up to 49percent stake in BoB Financial - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవో బీ) తన సబ్సిడరీ అయిన బీవోబీ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఎల్‌)లో 49 శాతం వరకు వాటాలను విక్రయించనుంది. ఇందుకు సంబంధించి బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది.

బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీకి ప్రస్తుతం 100 శాతం వాటా కలిగి ఉంది. అర్హత కలిగిన ఇన్వెస్టర్లు, వ్యూహాత్మక భాగస్వాముల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు కోరుతూ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని బీవోబీ తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top