భారతదేశంలో డయాబెటిస్ (షుగర్) చికిత్సలో కొత్త మార్పులకు నాంది పలుకుతూ.. ప్రముఖ ఔషధ సంస్థలు గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, జైడస్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 'సెమాగ్లూటైడ్' (Semaglutide) ఆధారిత కొత్త మందులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. సెమాగ్లూటైడ్ ఔషధానికి భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన వెంటనే ఈ కంపెనీలు తక్కువ ధరలతో జనరిక్ వేరియంట్లను విడుదల చేశాయి.
టైప్-2 డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) చికిత్సలో కీలకంగా భావించే GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) థెరపీని మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ కంపెనీలు ఈ ఉత్పత్తులు ప్రవేశపెట్టాయి. పెరుగుతున్న డయాబెటిస్ భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త లాంచ్లు దేశవ్యాప్తంగా రోగులకు మెరుగైన, అందుబాటు వైద్య సేవలను అందించనున్నాయి.
మనదేశంలో డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. GLP-1 ఆధారిత చికిత్సలు ఈ పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది.
ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (DCGI) ప్రకారం.. దేశంలో సుమారు 8.9 కోట్ల మంది పెద్దలు డయాబెటిస్తో బాధపడుతున్నారు, ఇది మొత్తం వయోజన జనాభాలో 10.5 శాతంగా ఉంది. ఊబకాయం దాదాపు అన్ని వయసుల వారిలో వేగంగా పెరుగుతోంది. పెద్దల్లో మహిళల్లో ఊబకాయం శాతం 12.6% నుంచి 24.0%కి, పురుషుల్లో 9.3% నుంచి 22.9%కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
సెమాగ్లుటైడ్ వంటి GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) మందులు బరువు తగ్గడంతో కూడా సహాయపడతాయి. ఇవి మెదడుకు కడుపు నిండినట్లు సంకేతాలు పంపి, జీర్ణక్రియను నెమ్మదింపజేసే ఒక సహజ హార్మోన్ను అనుకరించడం ద్వారా పనిచేస్తాయి. తద్వారా తక్కువ తింటారు.. క్రమంగా బరువు తగ్గడం జరుగుతుంది.
ఇవి తక్కువ తినడానికి మరియు మరింత సమర్థవంతంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆవిష్కర్త అయిన నోవో నార్డిస్క్, 20 మార్చి 2026న పేటెంట్ ప్రత్యేకతను కోల్పోకముందే, ప్రారంభ మార్కెట్ వాటాను చేజిక్కించుకునే ప్రయత్నంలో, గత సంవత్సరం భారతదేశంలో తన సెమాగ్లుటైడ్ బ్రాండ్లైన వెగోవి మరియు ఓజెంపిక్లను విడుదల చేసింది.


