37 కేజీల గంజాయి సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

37 కేజీల గంజాయి సీజ్‌

Jun 22 2025 4:04 AM | Updated on Jun 22 2025 4:04 AM

37 కేజీల గంజాయి సీజ్‌

37 కేజీల గంజాయి సీజ్‌

పాల్వంచరూరల్‌: గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు ఓ వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సీతానాగారం కాలనీ వద్ద రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న కారు పోలీసులను గమనించి కేఎల్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వైపు మళ్లింది. దీంతో పోలీసులు వెంబడించి కారును పట్టుకుని తనిఖీ చేశారు. వాహనంలో రూ.18.82 లక్షల విలువైన 37.650 కేజీల గంజాయి లభించింది. గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం సింగ్యాతండాకు చెందిన బానోతు వెంకన్న, బానోతు కల్పన, నర్సంపేట మండలం రాంనాయక్‌ తండాకు చెందిన గుగులోతు పార్వతిలను అరెస్ట్‌ చేశారు. విచారించగా ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి తరలింపునకు ఎస్కార్ట్‌గా ఉన్న ఒడిశాకు చెందిన రమేష్‌, రాము, బెంగళూరుకు చెందిన రాజేష్‌, ఏపీ రాష్ట్రంలోని తాడిపత్రికి చెందిన జవహర్‌లు పరారీ లో ఉన్నారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.

ఇద్దరు మహిళలు సహా

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement