
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
ఎస్ఐగా దర్జీ కుమారుడు..
మణుగూరు టౌన్: మండలంలోని కూనవరం గ్రామానికి చెందిన వెంపటి కృష్ణ 35 ఏళ్లుగా టైలర్గా పని చేస్తున్నాడు. నెలంతా కష్టపడినా రూ.15వేల ఆదాయం రాకున్నా ఇద్దరు కుమారులను కష్టపడి చదివించాడు. పెద్ద కుమారుడు పవన్ను ఇంజనీరింగ్ వరకు ప్రైవేట్ కళాశాలల్లో చదివించాడు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని గమనించిన పవన్.. ఆయన కల సాకారం చేయాలనుకున్నాడు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే సంకల్పాన్ని పెంచుకున్నాడు. ఎట్టకేలకు 2023 ఆగస్టు 6న వెలువడిన ఎస్ఐ ఫలితాల్లో 259 మార్కులతో అర్హత సాధించి ప్రస్తుతం ట్రైనీ ఎస్ఐగా వైరాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇకపై తన తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం కలగకుండా బాగా చూసుకుంటానని పవన్ సంతోషంగా చెబుతున్నాడు.