గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Nov 3 2025 6:56 AM | Updated on Nov 3 2025 6:56 AM

గుర్త

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి శతాధిక వృద్ధుడు కోటిరెడ్డి మృతి

ఫిరంగిపురం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేములూరిపాడు గ్రామానికి చెందిన షేక్‌ అసదుల్లా(52) కొండరాయి పనిచేస్తుంటాడు. పని మీద ఫిరంగిపురం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పెట్రోలు బంకు సమీపంలో రోడ్డు పక్కన నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈసంఘటనలో అసదుల్లా అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐ శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య షేక్‌ అస్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒకకుమారుడు, కుమార్తె ఉన్నారు.

కారెంపూడి: మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన అవుతు కోటిరెడ్డి(101) ఆదివారం మృతి చెందారు. కారెంపూడి మండలం లక్ష్మీపురం గ్రామం కోనసీమను తలపించే ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. కొల్లిపర మండలం మున్నంగి నుంచి వలస వచ్చిన కోటిరెడ్డి అన్నదమ్ములు మొదట గుడిసెలు వేసుకుని అంకురార్పణ చేశారు. సాగర్‌ కుడి కాల్వ రాకతో దాని బ్రాంచి కాలువ గ్రామం పక్కనే వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత దానిని గమనించిన ఆయన స్వగ్రామస్తులు ఉన్న ఊరిలో ఉన్న పొలం అమ్ముకుని ఇక్కడ పొలం కొనుక్కొని ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మరికొందరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇలా గృహసముదాయాలు ఏర్పాటు కావడంతో దానికి కోటిరెడ్డి లక్ష్మీపురం అనే నామకరణం కూడా చేశారు. దానికి ఉత్తరంలో కాలగర్భంలో కలసిపోయిన వీరలక్ష్మీపురం అగ్రహారం పేరు కలిసి వచ్చేలా ఆయన నామకరణం చేశారు. పల్నాట నూతన గ్రామం నెలకొల్పడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా కోటిరెడ్డికి పేరుంది. పైగా శతాధిక వృద్ధుడు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డికి పలువురు నివాళులర్పిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కృష్ణలంక(విజయవాడతూర్పు):ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యకి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా, నరసరావుపేటకు చెందిన కట్టా గురవయ్య(55) ఓల్డేజ్‌ హోమ్‌ నడుపుతున్నా డు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉ న్నారు. ఆదివారం ఉదయం గురువయ్య తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇబ్రహీపట్నంలో ఉంటున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి సాయంత్రం బయలుదేరి బీసెంట్‌రోడ్డుకు వెళ్లి షాపింగ్‌ చేశారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ మీ దుగా నరసరావుపేటకు వెళ్లే క్రమంలో వినాయకుని గుడి సమీపంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో రైల్వేస్టేషన్‌ నుంచి బస్టాండ్‌కు వెళ్తున్న గవర్నర్‌పేటకు డిపోకు చెందిన సిటీ ఆర్డినరీ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కింద పడిపోయారు. గురవయ్య తీవ్రంగా గాయపడి రక్తస్రావమై అపస్మారక స్థితిలో వెళ్లాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు అంబులెన్స్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి 
1
1/2

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి 
2
2/2

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement