ఫీజుల నియంత్రణపై చర్యలు ఏవీ? | - | Sakshi
Sakshi News home page

ఫీజుల నియంత్రణపై చర్యలు ఏవీ?

Jun 16 2025 6:01 AM | Updated on Jun 16 2025 6:01 AM

ఫీజుల నియంత్రణపై  చర్యలు ఏవీ?

ఫీజుల నియంత్రణపై చర్యలు ఏవీ?

చిలకలూరిపేట(యడ్లపాడు): ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల ఫీజుల దోపిడీపై కూటమి ప్రభుత్వం తక్షణమే కఠిన నియంత్రణలు విధించాలంటూ ఏపీ గిరిజనసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీను నాయక్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజులపై కొంత నియంత్రణ ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నేడు పాఠశాలల యజమాన్యాలు విద్యను పూర్తి వ్యాపారంగా మార్చివేశాయని ఆరోపించారు. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమా దం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నారని తెలిపారు. అలాగే విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలను రద్దు చేయాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు తప్పవంటూ హెచ్చరించారు.

ఏపీ గిరిజనసంఘాల ఐక్యవేదిక

రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీను నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement