విద్యుత్‌ అదనపు లోడు క్రమబద్ధీకరణ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అదనపు లోడు క్రమబద్ధీకరణ

Jun 12 2025 3:17 AM | Updated on Jun 12 2025 3:17 AM

విద్య

విద్యుత్‌ అదనపు లోడు క్రమబద్ధీకరణ

పర్చూరు(చినగంజాం): పర్చూరు మండలంలో చీరాల విద్యుత్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జాన్‌ థామస్‌ ఆధ్వర్యంలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్‌ ఈఈ ఎం. భాస్కరరావు, డీఈఈ విజయ్‌ శ్రీనివాసరావు, సిబ్బంది 35 బృందాలుగా ఏర్పడి 287 గృహ సర్వీసులు తనిఖీ చేశారు. అనంతరం పర్చూరు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. అదనపు లోడు వినియోగిస్తున్న 287 సర్వీసులకు రూ.8,10,600 జరిమానా విధించామని తెలిపారు. పర్చూరు డీఈఈ జె. శ్రీనివాసులు, చీరాల డీఈఈ హరిప్రసాద్‌రావు, వేటపాలెం డీఈఈ శ్రీనివాసులు, పర్చూరు ఏఈ రమేష్‌నాయక్‌, చీరాల డివిజన్‌ పరిధిలోని ఏఈలు, జేఈలు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ పాల్గొన్నారు.

నారాయణ పాఠశాలపై

చర్యలు తీసుకోవాలి

లక్ష్మీపురం: అమరావతి రోడ్డులోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా పాఠ్య పుస్తకాలను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్‌ డిమాండ్‌ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల వద్ద నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ మాట్లాడుతూ నారాయణ పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులతో దోపిడీలకు పాల్పడుతోందని విమర్శించారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న నారాయణ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నారాయణ, చైతన్య స్కూల్లో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లను, ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్‌, ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యదర్శి అమర్నాథ్‌, నగర సహాయ కార్యదర్శి వెంకట్‌, నగర నాయకులు అజయ్‌, భాస్కర్‌, చందు, సాయి గణేష్‌, సాయి, టి. అజయ్‌, సతీష్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర పోటీలకు జిల్లా అథ్లెటిక్‌ జట్టు ఎంపిక

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ఏపీ సీనియర్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఎంపిక చేశామని జిల్లా అథ్లెటిక్‌ సంఘం కార్యదర్శి జీవిఎస్‌ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటలకు పోటీలు జరిగే ప్రాంతంలో కోచ్‌ రవికుమార్‌కు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌ కార్డును అందించాలని సూచించారు.

పురుషులు: కృష్ణం నాయుడు, మొహిద్దీన్‌, రోషన్‌, వెంకట్‌ గురు శంకర్‌, ముజ్బర్‌, మదన్‌మోహన్‌, యుగంధర్‌, ప్రసన్న కుమార్‌, ప్రవీణ్‌ కుమార్‌, సుబ్రహ్మణ్యం, మణికంఠ నాయక్‌, అబ్దుల్లా, అశోక్‌, ప్రేమ్‌చంద్‌, తిరుపతిరావు, రాజమోహన్‌, ఎస్‌.శంకర్‌, దీపు, భరత్‌ కుమార్‌, డి.మణికంఠ

మహిళలు: ఎస్‌కే ఆషా, కె.అంకమ్మ, డి.వైష్ణవి, కె.రేష్మి, కృష్ణ రచన.

విద్యుత్‌ అదనపు లోడు క్రమబద్ధీకరణ 1
1/1

విద్యుత్‌ అదనపు లోడు క్రమబద్ధీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement