
సాక్షి, గుంటూరు: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.
జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. అహింస వాదంతో ఏమైనా సాధించవచ్చని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి చూపించిన మహనీయుడు ఆయన. గాంధీగారి సిద్ధంతాలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శనీయం. సత్యమేవ జయతే అని సందేశం ఉంచారాయన.

