సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం తగదన్నారు. ఇటీవల తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుపతి లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూలో బాత్రమ్ క్లీనర్ కలిసిందని సీఎం చెప్పడం సరికాదు. జగన్ను ఇరుకున పెట్టేందుకే చంద్రబాబు అలా చెప్పారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగితే పరీక్షించే మిషన్ టీటీడీ వద్ద లేదా?. తిరుపతి లడ్డూపై కేవలం రాజకీయం చేస్తున్నారు’అని ద్వజమెత్తారు.


