పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిపడిన అలలకు ఉమామహేశ్వర్ రావు, సీహెచ్ సుభాష్ అనే ఇద్దరు వ్యక్తులు సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో ఉమా మహేశ్వర్ మృతదేహం లభ్యమైంది. సీహెచ్ సుభాష్ కోసం గాలింపులు చేపడుతున్నారు. సముద్రంలో కొట్టుకుపోయిన సీహెచ్ సుభాష్ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.


