శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి  | Supreme Court Judge in Srivari Seva | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి 

Aug 14 2023 3:25 AM | Updated on Aug 14 2023 3:25 AM

Supreme Court Judge in Srivari Seva - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవా­రిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ఆదివారం కుటుంబ సభ్యుల­తో కలిసి దర్శించుకున్నా­రు. ఆయనకు టీటీడీ చైర్మ­న్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మా­రెడ్డి స్వాగతం పలికారు. దర్శ­నం అనంతరం జస్టిస్‌ భూ­షణ్‌ రామకృష్ణ గవాయ్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు.

తీర్థప్రసాదాలు, శ్రీవారి ఫొటో, నమామి గోవిందం కిట్, అగర్‌బత్తీలు, డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీతో తయారు చేసిన స్వామివారి ఫొటోను టీటీడీ చై­ర్మన్‌ అందజేశారు. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ కూడా స్వా­మివారిని దర్శించుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకో­ర్టు సీజే శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు చేశారు.  

తిరుచానూరులో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వీరికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ఠాకూర్‌కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతకుముందు ఏపీ హై­కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల శ్రీవారిని ఆదివారం కేంద్ర మంత్రి అను­రాగ్‌ ఠాకూర్‌  దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement