పవన్‌ బహుజనుల పక్షమో, ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలి | Support Initiations Of Three Capitals Reaching Its 50th Day | Sakshi
Sakshi News home page

పవన్‌ బహుజనుల పక్షమో, ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలి

Nov 19 2020 4:04 AM | Updated on Nov 19 2020 4:04 AM

Support Initiations Of Three Capitals Reaching Its 50th Day - Sakshi

మాట్లాడుతున్న సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు మాదిగాని గురునాథం

తాడికొండ:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బహుజనుల పక్షమో.. ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలని సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్‌గా మారి.. అమరావతి జేఏసీ కోసం జోలె పడతామనడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు.

హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి దీక్షలకు మద్దతు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తే జనసేన అధినేత పవన్‌కల్యాణ్, వామపక్షాల నేతలు, చంద్రబాబు ఇళ్లను ముట్టడించడం ఖాయమన్నారు. దీక్షలకు ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ దిష్టిబొమ్మకు జోలెకట్టి అందులో పావలా నాణేలు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు, నవ్యాంధ్ర ఎమ్మారీ్పఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, పీవీ రావు మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనరాజు, దళిత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు చెట్టే రాజు, దళిత సంఘాల నాయకులు మేదర సురేష్, బొండపల్లి గిరిజ, బండి పుణ్యశీల, కాలే పుల్లారావు, బూదాల శ్రీనివాస్, మధిర ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement