
సాక్షి, విశాఖపట్నం : సింహాచలం భూముల అక్రమాలకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, ఏఈవో సుజాతను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దేవాలయ ఆస్తుల రిజిష్టర్ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్, ఏఈవో సుజాతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.