ఆర్సీబీ విజయం.. టీజీ, ఏపీలో అభిమానుల వీరంగం | RCB Supporters Over Action in Telangana And AP | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ విజయం.. టీజీ, ఏపీలో అభిమానుల వీరంగం

Jun 1 2026 10:21 AM | Updated on Jun 1 2026 10:46 AM

RCB Supporters Over Action in Telangana And AP

సాక్షి, విజయవాడ/హైదరాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. తమ అభిమాన జట్టు వరుసగా రెండు టైటిళ్లు కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు సంబురాలు చేసుకున్నాయి. కానీ, పలుచోట్ల అభిమానులు రచ్చ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.

విజయవాడ.. 
విజయవాడలో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ అభిమాన జట్టు గెలవడంతో రోడ్లపైకి వచ్చి ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బైకులతో రోడ్లపై ప్రమాదకర ఫీట్స్ చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు యువకులను చెదరగొట్టారు.

 

కర్నూలు..
కర్నూలులో ఆర్బీబీ అభిమానులు వీరంగం సృష్టించారు. ఆర్బీసీ విజయం ఆనందంలో అభిమానులు అరాచకాలకు పాల్పడ్డారు. సంబురాలను శృతి మించే విధంగా నిర్వహించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్నూలు రాజ్ విహర్ సెంటర్ చేరుకొని ట్రాఫిక్ బ్యారికేడ్స్‌తో పాటు ప్రైవేటు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని చెదరగొట్టారు.

విశాఖ.. 
విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తి గెలుపు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ కారు ఎక్కి, జెండాలు ఊపుతూ రోడ్లపై రచ్చ రచ్చ చేశారు.

హైదరాబాద్‌..
హైదరాబాద్‌లోనూ ఆర్సీబీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. ఆ‍ర్సీబీ విజయంతో ట్యాంక్ బండ్ వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి ‘ఆర్సీబీ.. ఆర్సీబీ’ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో ట్యాంక్‌ బండ్‌ వద్దకు తరలివచ్చారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement