విద్యార్థులా?.. కూలీలా? | Andhra Pradesh Govt School Students Forced to Lift Stones and Mud, Video Sparks Outrage | Sakshi
Sakshi News home page

విద్యార్థులా?.. కూలీలా?.. బాబు సర్కార్‌పై ఫైర్‌

Aug 28 2025 11:37 AM | Updated on Aug 28 2025 11:54 AM

Netizens Serious Comments On Chandrababu Govt

సాక్షి, మైదకూరు: ఏపీలో ‍కూటమి సర్కార్‌ పాలనలో తరగతి గదిలో కూర్చోవాల్సిన విద్యార్థులు.. రాళ్లు, మట్టి ఎత్తుతున్నారు. విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్లే వారితో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మైదుకూరు మండలం జీవిసత్రం సమీపంలోని నంద్యాలపేట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జడ్పీ పాఠశాలలో కొత్త బిల్డింగ్ పనుల సందర్భంగా విద్యార్థులతో రాళ్లు, మట్టి ఎత్తిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇక, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విద్యార్థులు పేరెంట్స్‌, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు, ఐసీడీఎస్, కార్మిక శాఖ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement