సోషల్‌ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ | Ministerial committee to regulate social media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ

Oct 2 2025 5:45 AM | Updated on Oct 2 2025 5:45 AM

Ministerial committee to regulate social media

సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తే సహించలేని స్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు దానిని కట్టడి చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

మానవ వనరులు, ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫ­రాలు, సమాచార శాఖ, హోం శాఖ మంత్రులతో కూడిన బృందాన్ని కమిటీగా ఏర్పాటు చేశారు. కమిటీ కార్యక­లాపాలను సమన్వయం చేయడానికి సమాచార శాఖ డైరెక్టర్‌ ఈ బృందానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ ఎవరైనా నిపుణుల సహాయం తీసుకోవచ్చు.

మంత్రుల బృందం బాధ్యతలివీ
» దేశంలోని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు వర్తించే ప్రస్తుత చట్టాలు, నియమాలు, మార్గద­ర్శకాలను సమీక్షించాలి.
»  జవాబుదారీతనం, సమ్మతి అమలులో అంతరాలను గుర్తించాలి.
»  అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలి. పారదర్శకత ప్రమాణాలు, ప్లాట్‌­ఫా­మ్‌ బాధ్యతలు, వినియోగదారుల రక్షణ చర్య­లతో సహా సోషల్‌ మీడియా జవాబు­దారీత­నానికి ప్రపంచ విధానాలను విశ్లేషించాలి.
»  హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్‌ దుర్వినియోగం, జాతీయ భద్రతకు ముప్పు తదితర అంశాలకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేయాలి.
» ఫిర్యాదుల పరిష్కారం, నివేదించే విధానాలపై స్పష్టమైన బాధ్యతలను సూచించాలి. పౌర హక్కులను కాపాడటంపై సలహా ఇవ్వాలి.
»  నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్‌ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలను సృష్టించడం లేదా బలోపేతం కోసం సిఫార్సు చేయాలి. 
»  నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మంత్రుల బృందం తమ సిఫార్సులను ప్రభుత్వానికి త్వరగా సమర్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement