సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో నీరు–చెట్టు పథకం కింద జరిగిన పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. పనులు చేయకుండానే చేసినట్లు, 50 శాతం పనులు చేసి 100 శాతం పనులు చేసినట్లు కాంట్రాక్టర్లు తప్పుడు లెక్కలు చూపారని వివరించింది. నీరు–చెట్టు కింద జరిగిన పనులన్నింటిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించామని తెలిపింది.
► విజిలెన్స్ విచారణ నేపథ్యంలోనే చెల్లింపులన్నింటినీ నిలిపేశామంది. విజిలెన్స్ విచారణ జరుగుతున్నందున పిటిషన్లపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది.
► ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఉత్తర్వులు జారీ చేశారు. నీరు–చెట్టు కింద పనులను పూర్తి చేసినప్పటికీ తమకు చెల్లించాల్సిన మొత్తాలను ప్రభుత్వం ఆపేసిందంటూ కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాదరావు, శ్రీధర్, మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
► ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ రజనీ మంగళవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కాంట్రాక్టర్లతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని తెలిపారు. విజిలెన్స్ విచారణలో అన్నీ తేలతాయన్నారు.
నీరు–చెట్టు పనుల్లో భారీ అక్రమాలు
Published Wed, Sep 2 2020 5:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement