వైభవంగా గర్నిమిట్ట ఎల్లమ్మ జాతర  | Garnimitta Yallamma Jatara Held With Glory In Chittoor District | Sakshi
Sakshi News home page

వైభవంగా గర్నిమిట్ట ఎల్లమ్మ జాతర 

May 24 2022 10:41 PM | Updated on May 24 2022 10:41 PM

Garnimitta Yallamma Jatara Held With Glory In Chittoor District - Sakshi

కేవీపల్లె: ఆలయ ప్రదక్షిణలు చేస్తున్న చాందినీబండ్లు 

కేవీపల్లె: మండలంలోని గర్నిమిట్ట గ్రామదేవత ఎల్లమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు బోనాలు తెచ్చి అమ్మవారికి స మర్పించారు. మండలం నుంచే గాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చాందినీ బండ్లు, బళ్లారి డ్రమ్మ్, చెక్క భజన లు, కోలాటాలు, పిల్లనగ్రోవి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సోమవారం  చాందినీబండ్లతో  ప్రదక్షిణలు చేశారు.      

ముగిసిన సత్యమ్మ జాతర 
కలికిరి: పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీలో ఉన్న సత్యమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర సోమవారంతో ముగిసింది.  ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి దీలు, బోనా లు సమర్పించారు. అన్నదానం చేశారు.   

ఘనంగా ఊంజల్‌ సేవ 
వాల్మీకిపురం: గ్రామదేవత నల్లవీర గంగాభవానీ అమ్మవారికి సోమవారం ఊంజల్‌ సేవ వైభవంగా నిర్వహించారు.  కమిటీ సభ్యులు రాంకుమార్‌ రెడ్డి, రమణారెడ్డి, బలరాం, మహేష్, రవి, జనాస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement