‘మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం’ | CM YS Jaganmohan Reddy Tweet About Parishad Elections Results | Sakshi
Sakshi News home page

‘మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం’

Sep 20 2021 3:48 AM | Updated on Sep 20 2021 9:51 AM

CM YS Jaganmohan Reddy Tweet About Parishad Elections Results - Sakshi

సాక్షి, అమరావతి: ‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలవల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచింది’.. అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై ఆదివారం సీఎం ట్వీట్‌ చేశారు. ‘సోమవారం ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. అప్పుడు మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను’.. అని సీఎం అందులో పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement