సాక్షి,అమరావతి: హెరిటేజ్కి చంద్రబాబు ప్రభుత్వం భారీ రాయితీలు కల్పించింది. టైలర్ మేడ్ రాయితీలిస్తూ జీవో 57ను ప్రభుత్వం జారీ చేసింది. హెరిటేజ్ కంపెనీకి మొత్తం రూ.59.69 కోట్లు రాయతీలిస్తున్నట్లు జీవోలో పేర్కొంది.
35మందికి ఉద్యోగాలిస్తుందని రూ.59.69కోట్ల రాయితీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ రూ.34.93కోట్లు ఇస్తుంది. ఐదేళ్ల పాటు 100శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్,జీఎస్టీ రీయింబర్స్మెంట్ కింద రూ.17.80కోట్లు లబ్ధి. ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కి రూపాయి రాయితీ, ఐదేళ్లూ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్కి రూపాయి రాయితీ ఇచ్చింది. విద్యుత్ రాయితీల ద్వారా హెరిటేజ్కి రూ.2కోట్లు లబ్ధి చేకూరనుంది. 2శాతం వడ్డీ రాయితీ కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


