ఇళ్ల నిర్మాణాలు అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలు అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర

Published Fri, Jun 11 2021 2:33 PM

Bahujana Parirakshana Samithi Comments On TDP - Sakshi

సాక్షి, గుంటూరు : మందడంలో అభివృద్ధి వికేంద్రీకరణ దీక్ష 256వ రోజుకు చేరుకుంది. శుక్రవారం బహుజన పరిరక్షణ సమితి మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారం చంద్రబాబు బ్యాచ్‌ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించింది. మొన్నటి వరకు ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తుంటే అడ్డుకున్నారు.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను అడ్డుకుంటున్నారని మండిపడింది. ఇళ్ల నిర్మాణాలు అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించింది.

Advertisement
Advertisement