ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..
మంత్రుల అసహనం..
- శాసనమండలి..
- డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం
- వైఎస్సార్సీపీపై, విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
- బొత్స సత్యనారాయణను దద్దమ్మ అంటూ నోరుపారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
- గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు
- అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం
- డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన అసెంబ్లీ
- శాసన మండలి వాయిదా.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
- డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ మండలిలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
- మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- డీఎస్సీలో విచారణ జరిపించాల్సిందే
- డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదు
- ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి
- డీఎస్సీలో పారదర్శకత లేదు
- అందుకే డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలి
- మూడు లక్షల మంది అభ్యర్ధులను ఏ రకంగా మోసం చేశారన్న విషయంపై చర్చ జరగాలి
- డీఎస్సీలో పోస్టులు అమ్ముకున్నారు
ప్రారంభమైన శాసనమండలి సమావేశాలు
- డీఎస్సీలో అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
- వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతా రెడ్డి, రామ చంద్రారెడ్డి
- వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్
- శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం
- డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్సీపీ పట్టు
- డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్సీలు నినాదాలు
ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి కామెంట్స్..
- డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి.
- డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.
- విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే లోకేష్ రాజీనామా చేయాలి.
- మీకు అనుకూలంగా జీవోలు మార్చుకుంటారా?
- కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి.
- మంత్రి లోకేష్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
- ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడమేంటి?.
ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్..
- మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
- స్పోర్ట్స్ కోటా పేరుతో డీఎస్సీలో అక్రమాలు చేశారు.
- మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే.
- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు లోకేష్ కూడా చేయాలి.
👉ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ఏపీ డీఎస్సీ అక్రమాలపై పోరాటానికి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సిద్ధమైంది. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.
👉శాసన మండలిలో దీనిపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు రెడీ అయ్యారు. ప్రదర్శనగా శాసనమండలిలోకి ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. డీఎస్సీ అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎమ్మెల్సీ లు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, రామ చంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు.


