ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు | 5646 New Corona Positive Cases Reported In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు

Jun 20 2021 5:43 PM | Updated on Jun 20 2021 5:49 PM

5646 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,00,001 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా  5,646 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1850563కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 7,772 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 1775176 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో 11, పశ్చిమ గోదావరిలో 7 , గుంటూరులో 6, తూర్పు గోదావరిలో 5, శ్రీకాకుళంలో 4, అనంతపురం, వైఎస్సార్‌ కడప, కృష్ణా, ప్రకాశంలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున మృతిచెందగా, నెల్లూరులో ఒక్క రు మరణించారు. మొత్తం 50 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 12319 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63068యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో 2,11,50,847 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డ్‌.. 
చేతికి చిక్కాక.. గుట్టుచప్పుడు గాకుండా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement