అనంతపురం కల్చరల్: యోగాతో ఒత్తిడి దూరమవు తుందని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. స్థానిక పీటీసీ మైదానంలో శనివారం ఆయుష్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వివిధ యోగా కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ వినోద్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్పీ పి.జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా భాగం కావాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే యోగాను అలవర్చుకోవాలన్నారు. బ్రహ్మకుమారీల ఇన్చార్జ్ సిస్టర్ శారద, వివేకానంద యోగా కేంద్ర అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, యోగా శిక్షకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమన్నారు. అనంతరం క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. రాష్ట్రస్థాయి ‘యోగాంధ్ర’ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలనందించి సత్కరించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్వో మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీఎంహెచ్ఎ డాక్టర్ దేవి, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఆయుష్ అధికారులు డాక్టర్ రామకుమార్, లాల్యానాయక్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మమత, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వినోద్కుమార్