అనంతపురం: పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉమ్మడి జిల్లాలోని అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, హిందూపురం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. తొలిరోజు 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టినట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి. జయచంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 161 మంది కౌన్సెలింగ్కు హాజరైనట్లు పేర్కొన్నారు.
మరిన్ని వివరాలిలా..
28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 25 నుంచి 30 వరకు(25,26 తేదీల్లో 1–50,000 ర్యాంకు వరకూ, 27,28 తేదీల్లో 50,001–90,000 ర్యాంకు, 29,30 తేదీల్లో 90,001–చివరి ర్యాంకు) వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్లైన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన రసీదు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీపత్రాలు, కుల (ఓసీ అభ్యర్థులైతే ఈడబ్ల్యూఎస్), ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డుతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ కౌన్సెలింగ్లో పాల్గొనే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున ఆన్లైన్ విధానంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.