రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Nov 10 2025 8:16 AM | Updated on Nov 10 2025 8:16 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఎస్‌.రాయవరం: మండలంలో గోకులపాడు సమీపంలో జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన ఊడి రంజిత్‌ (28)తలుపులమ్మ లోవ నుంచి స్వగ్రామం వస్తుండగా కారుని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బైకుతో రోడ్డుపై పడిపోయాడు. ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. బైకుపై ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడినట్టు చెప్పారు. వివరాలు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement