అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు

Nov 10 2025 8:16 AM | Updated on Nov 10 2025 8:16 AM

అప్పన

అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు

సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసిసంహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణసంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.

విశేషంగా నిత్యకల్యాణం : శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం విశేషంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.

అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు 1
1/1

అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement