పాలిటెక్నిక్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Jun 22 2025 3:32 AM | Updated on Jun 22 2025 3:32 AM

పాలిట

పాలిటెక్నిక్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రారంభం

నర్సీపట్నం/తుమ్మపాల: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు శనివారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. నర్సీపట్నం పాలిటెక్నిక్‌ కళాశాల, అనకాపల్లి మండలంలోని రేబాక పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొదటి రోజు 1 నుంచి 15,000వ ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. నర్సీపట్నం కాలేజీ ప్రిన్సిపాల్‌ తాతాజీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించారు. 3,567 ర్యాంకు వచ్చిన విద్యార్థి పి.విజయ్‌కుమార్‌తో మొదటి వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను పాలిటెక్నిక్‌ స్టేట్‌ సెక్రటరీ జి.వి.రామచంద్రరావు పరిశీలించారు. ధ్రువపత్రాల ను పరిశీలించి రశీదు, సర్టిఫికెట్‌ను అందజేశారు. తొలి రోజు ఈ సెంటర్‌లో 60 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. రేబాక సెంటర్‌లో 164 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఐ.వి.ఎస్‌.ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు పొందిన సిగ్గు శ్రీవెంకట్‌ (556), లక్కవరపు ధరణి (1,233)ల సర్టిఫికెట్లను తొలుత పరిశీలించారు. ఆదివారం 15,001 నుంచి 32,000 ర్యాంకు వరకు గల విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

పాలిటెక్నిక్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రారంభం1
1/2

పాలిటెక్నిక్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రారంభం

పాలిటెక్నిక్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రారంభం2
2/2

పాలిటెక్నిక్‌ ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement