
జారిపడితే ఎవరిది బాధ్యత?
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గాంధీనగరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బాల కార్మికులుగా అవతారమెత్తారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పాఠశాలలో ఒక గది రేకుల షెడ్పై పడిన ఎండిన ఆకులను శుభ్రం చేసి, ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఎత్తి కిందకు దించారు. ఈ సముదాయంలోనే ప్రైమరీ, హైస్కూల్ కలిపి ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారీ చెట్ల ఆకులన్నీ స్కూల్ ప్రాంగణంలో షెడ్పై పడుతుంటాయి. ఆ షెడ్పైకి వెళ్లడానికి మెట్ల సదుపాయం లేదు. అలాగని నిచ్చెన సాయంతో జాగ్రత్తతో వెళ్లారా అంటే అదీలేదు. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కాలు జారితే భారీ మూల్యమే చెల్లించుకోవాలి. అసలు కూలీలతో చేయించాల్సిన పనులు విద్యార్థులతో ఎందుకు చేయించారో...?
గాంధీనగరం ప్రభుత్వ పాఠశాలలో షెడ్డుపై ఎండిన ఆకులను శుభ్రం చేస్తున్న బాలలు

జారిపడితే ఎవరిది బాధ్యత?