జిల్లాలో 4,698 యోగా వేదికలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 4,698 యోగా వేదికలు

Jun 21 2025 3:29 AM | Updated on Jun 21 2025 3:29 AM

జిల్లాలో 4,698 యోగా వేదికలు

జిల్లాలో 4,698 యోగా వేదికలు

తుమ్మపాల: జిల్లాలో యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె జిల్లా అఽధికారులతో కలిసి శనివారం ఉదయం జిల్లా వ్యాప్తంగా 4,698 వేదికల వద్ద జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధతపై అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలు, మండలాలు, జిల్లా కేంద్రంలో యోగా వేడుకలను ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించాలన్నారు. విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేయనున్న నేపథ్యంలో అన్ని చోట్ల 8 లక్షల మంది యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, స్వయం సహాయక బృందం సభ్యులు, ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు, ఆశా వర్కర్లు , విద్యార్థులు, సాధారణ ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇప్పటికే 7,72,812 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, ట్రైనర్లు, పాల్గొన్న వారికి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ కె.లావణ్య, జిల్లా యోగాంధ్ర సమన్వయ అధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ కె.మనోరమ, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

అన్ని మండలాల్లో నిర్వహించేందుకు

ఏర్పాట్లు

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement