పరిహారం కోసం వంటావార్పు | - | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం వంటావార్పు

Jun 21 2025 3:29 AM | Updated on Jun 21 2025 3:29 AM

పరిహా

పరిహారం కోసం వంటావార్పు

నక్కపల్లి: అమలాపురంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు కోసం సేకరిస్తున్న భూములకు నష్ట పరిహారాన్ని మత్స్యకార సొసైటీకి చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలంటూ మత్స్యకారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రత్యేకంగా టెంట్లు వేసి నిరసన తెలియజేయడంతో పాటు, అక్కడే వంటావార్పు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

అమలాపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 410/4, 41, 418లో సుమారు 43 ఎకరాల మెట్ట భూమిని 1994లో ప్రభుత్వం కనకమహాలక్ష్మి మత్స్యకార సొసైటీకి లీజుకు ఇచ్చింది. గ్రామానికి చెందిన మత్స్యకారులంతా ఈ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. 2014లో భూసేకరణ సమయంలో ఈ సొసైటీ భూములను ఏపీఐఐసీ సేకరిస్తున్నట్లు అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌ ప్రకటించారు. ఈ భూములపై ఆధారపడ్డ మత్స్యకారులంతా అధికారులను కలిసి ఉపాధి కోల్పోతామంటూ వినతిపత్రాలు అందజేశారు. ఈ భూములకు ఇచ్చే నష్టపరిహారం సొసైటీ పేరున మంజూరు చేస్తామని అప్పటి కలెక్టర్‌ మినిట్స్‌లో కూడా పొందుపరిచారని మత్స్యకార నాయకులు పెదకాపు తాతారావు తదితరులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ భూములకు నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నా అధికారులు పట్టించుకోడం లేదు. ఈ భూముల్లో ఏపీఐఐసీ అధికారులు రోడ్లు, కాలువల నిర్మాణానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులంతా వెళ్లి అడ్డుకోవడంతో పోలీసుల సాయంతో ఈ భూములను స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. దీంతో మత్స్యకారులంతా ఈ భూముల వద్ద శుక్రవారం టెంట్లు వేసి ఆందోళన చేపట్టారు. వీరికి సీపీఎం జిల్లా నాయకులు ఎం.అప్పలరాజు, రాజేష్‌, సత్యనారాయణ తదితరులు సంఘీభావం తెలిపారు. భూములకు నష్టపరిహారం చెల్లించకుండా అధికారాన్ని అడ్డంపెట్టుకుని స్వాధీనం చేసుకోవాలని ప్రబుత్వం కుట్ర చేస్తోందని అప్పలరాజు, తదితరులు ఆరోపించారు. సొసైటీ సభ్యులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాంబిల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో ఎన్‌ఏవోబీ కోసం సేకరించి మత్స్యకార సొసైటీ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని గుర్తు చేశారు. అలాగే ఉప్పుటేరుకు వెళ్లే అన్ని మార్గాలను ఏపీఐఐసీ మూసి వేసి, మత్స్యకారుల జీవనోపాధికి ఆటంకం కల్గించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ ఆందోళనలో మత్స్యకార నాయకులు వంకా కృష్ణ,రాజు, సూరిబాబు, అప్పలరాజు, పాల్గొన్నారు.

అమలాపురంలో మత్స్యకారుల

ఆందోళన

నష్ట పరిహారం సొసైటీకే చెల్లించాలని డిమాండ్‌

పరిహారం కోసం వంటావార్పు 1
1/1

పరిహారం కోసం వంటావార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement