
పద్మశాలీ గ్లోబల్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ నేడు
అచ్యుతాపురం రూరల్ : విశాఖ సిటీలోని శంకరమఠం ఎదురుగా పద్మ శాలీ భవనంలో పద్మ శాలీ గ్లోబల్ ట్రస్ట్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి పద్మశాలీలు హాజరు కావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు పిలుపునిచ్చారు. శనివారం అచ్యు తాపురం చేనేత కార్యాలయం వద్ద జిల్లా పద్మశాలీ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లా డుతూ విశాఖలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జరగబోయే కుల, జనగణన కార్యక్రమంలో హాజరై ప్రభుత్వానికి పద్మశాలీల సంఖ్యా బలం తెలియజేయాలన్నారు. దుప్పితూరు భద్రావతీ చేనేత సహకార సంఘం అనకాపల్లి జిల్లా చేనేత అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు, మేనేజర్ మాడెం అప్పారావు, ఉమ్మడి విశాఖ జిల్లా చేనేత నాయకులు ఋషిబాబు, జగ్గారావు, రమణమ్మ, రాజు, అప్పలరాజు, ఈశ్వర్రావు, గుద్దటి రాజు, నానాజీ, పప్పు సరోజని పాల్గొన్నారు.