
జెండా కొండ అందాలు అద్భుతం
హుకుంపేట: అత్యంత ఎత్తయిన సీతమ్మ పర్వతం, జెండాకొండ అందాలు అద్బుతమని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని ఆయా ప్రాంతాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు. మండలంలోని తడిగిరి పంచాయతీ బరెంగ్బంద వరకు వాహనంలో వెళ్లారు. అక్కడి నుంచి సీతమ్మ పర్వతానికి మూడు కిలోమీటర్ల మేర ప్రకృతి అందాలను తిలకిస్తూ కాలినడకన వెళ్లారు. చల్లటి వాతావరణంలో కొంతసేపు గడిపాడు. తేనెపట్టు గుహలు, థింసారాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతమ్మ పర్వతాన్ని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రత్యేకదృష్టి సారిస్తామన్నారు. అనంతరం కొండ దిగువనున్న బరెంగ్బందలో ఆల్పహారంగా రాగి జావను గిరిజనులతో కలిసి తాగారు. తడిగిరి నుంచి బరెంగ్బంద వరకు అధ్వానంగా మార్గం ఉండటంపై ఆయన స్పందించారు. రోడ్డు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూడా రాజుబాబు, సర్పంచ్ పెనుమల రంజిత్కుమార్, జిల్లా వ్యవసాయ సలహామండలి మాజీ సభ్యుడు ముత్యంగి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్ కుమార్
కుటుంబ సభ్యులు, స్నేహితులతో
కలిసి సందర్శన