● పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు
● ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్
పాడేరు : కలుషిత ఆహారం తిన్న 14 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం పాడేరు ఘాట్లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నాతవరం ప్రాంతానికి చెందిన 20 మంది భక్తులు ఆదివారం పాడేరు ఘాట్లోని మోదకొండమ్మ అమ్మవారి పాదాలను దర్శించుకునేందుకు వచ్చారు. ఇంటివద్ద తయారుచేసి తీసుకువచ్చిన పులిహోర తినడంతో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న వారిని హుటాహుటిన స్థానిక సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వారికి వైద్యసేవలు కల్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో 14 మందిని డిశ్చార్జ్ చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా తెలిపారు.
కలుషిత ఆహారం తిని14 మంది భక్తులకుతీవ్ర అస్వస్థత
కలుషిత ఆహారం తిని14 మంది భక్తులకుతీవ్ర అస్వస్థత