
అడవిగేదె హల్చల్
● బస్సుకు అడ్డంగా ఉండటంతోఆందోళనకు గురైన ప్రయాణికులు
సీలేరు: అంతర్ రాష్ట్ర రహదారిలో సప్పర్ల రెయిన్గేజ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున అడవిదున్న హల్చల్ చేసింది. భఽధ్రాచలం నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ఉండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై సుమారు ఐదు నిమిషాలు ఉండటంతో ఫొటోలు, వీడియోలు తీశారు. ఇదే ప్రదేశంలో ఐదు నెలల క్రితం బెంగాల్ టైగర్ రోడ్డు దాటుతూ కనిపించడంతో ఈ ప్రాంత గిరిజనులు ఇప్పటికే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అడవి దున్న ప్రత్యక్షమైంది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడవి జంతువులకు ఎటువంటి హాని కలిగించవద్దని అటవీ సిబ్బంది సూచించారు.