breaking news
vultures
-
నైజీరియాలో రాబందుల కనుమరుగు.. కాపాడేందుకు ‘వల్చర్ కింగ్’ పోరాటం
పశ్చిమ ఆఫ్రికాలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. రాబందులు.. చనిపోయిన జంతువుల కళేబరాలను తినడంతో వ్యాధులు వ్యాప్తి చెందకుండా పర్యావరణాన్ని కాపాడుతాయి. అలాంటి రాబందులు తగ్గిపోవడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వ్యాధుల వ్యాప్తి ప్రమాదం కూడా పెరుగుతోందని పర్యావరణ పరిరక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాగే, సంప్రదాయ విశ్వాసాల పేరుతో వాటిని వేటాడటం, విషప్రయోగం చేయడం, వాటి నివాస ప్రాంతాలను ధ్వంసం చేయడం వంటి కారణాలతో పలు రాబందుల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.అయితే నైజీరియాలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న అవ్కా-ఏటీటీ(Awka-Etiti) అనే చిన్న పట్టణం మాత్రం ఇందుకు భిన్నమైన ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు రాబందులను పవిత్ర పక్షులుగా భావిస్తూ వాటిని రక్షిస్తున్నారు.దేవతకు నైవేద్యం.. రాబందులకు ఆహారంఅవ్కా-ఏటీటీలో(Awka-Etiti) ‘న్గుమా’ అనే దేవతకు అంకితమైన ఓ పురాతన పుణ్యక్షేత్రం చుట్టూ పవిత్ర అడవి ఉంది. అక్కడ రాబందులు తరతరాలుగా సంచరిస్తున్నాయి. స్థానికుల సంప్రదాయ ఆచారాల్లో భాగంగా రాబందులకు ఆహారం లభిస్తుండటంతో అవి తరచూ ఆలయ పరిసరాలకు చేరుతుంటాయి. అలాగే, చుక్వుమెకా ఇగ్వే(Chukwuemeka Igwe) అనే స్థానికుడు రాబందుల పరిరక్షణ కోసం చేస్తున్న కృషితో ‘వల్చర్ కింగ్’గా పేరొందాడు. ‘ఇక్కడి స్థానికులు రాబందులను వేటాడరు. నైవేద్యం సమర్పించిన తర్వాత రాబందులు కనిపిస్తే దేవత తమ ప్రార్థనను స్వీకరించినట్లుగా భావిస్తారు’’ అని ఆయన చెబుతున్నారు.రాబందులు లేకపోతే వ్యాధుల ముప్పురాబందులను కేవలం కళేబరాలను తినే పక్షులుగా చూడటం తప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి ప్రకృతికి అత్యంత కీలకమైన ‘క్లీనింగ్ సర్వీస్’ అందిస్తాయి. దీంతో చనిపోయిన జంతువుల కళేబరాలను కొన్ని గంటల్లోనే తినేయడం ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి.వాటి జీర్ణాశయంలోని శక్తివంతమైన ఆమ్లాలు.. ఆంత్రాక్స్, రేబిస్ వంటి వ్యాధులతో చనిపోయిన జంతువులను కూడా జీర్ణించుకోగలుగుతాయి. రాబందుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిన ప్రాంతాల్లో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు పెరిగినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయని నైజీరియా కన్జర్వేషన్ ఫౌండేషన్(NCF) జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.50 ఏళ్లలో 80–97 శాతం తగ్గుదలబర్డ్లైఫ్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం.. ఆఫ్రికాలో గత 50 ఏళ్లలో రాబందుల సంఖ్య 80 నుంచి 97 శాతం వరకు పడిపోయింది. దీంతో ఆఫ్రికాలోని ఏడు రాబందుల జాతులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులుగా గుర్తించబడ్డాయి. విషప్రయోగం రాబందుల మరణాలకు ప్రధాన కారణంగా మారింది. ఆఫ్రికాలో రాబందుల మరణాల్లో సుమారు 60 శాతం విషప్రయోగం వల్లేనని అంచనా.ఒక్క రాబందు ధర రూ.1.6 లక్షలు!సంప్రదాయ వైద్యం, ఆధ్యాత్మిక విశ్వాసాల పేరుతో రాబందులు, వాటి శరీర భాగాలకు డిమాండ్ పెరుగుతోంది. నైజీరియాలో గతంలో ఒక రాబందు ధర సుమారు 25 నుంచి 30 వేలు ఉండేది. ఇప్పుడు అదే పక్షి 2 లక్షల వరకు పలుకుతోందని పరిరక్షణ నిపుణులు చెబుతున్నారు.రాబందుల గుడ్లు, గూళ్లను కూడా అక్రమంగా సేకరిస్తున్నారు. ఇవి నెమ్మదిగా సంతానోత్పత్తి చేసే పక్షులు అవడంతో ఈ చర్య వాటి మనుగడకు హాని కలిగించేదిగా మారుతుంది. సాధారణంగా రాబందులు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయసులో సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. అలాగే, ఒకటి లేదా రెండేళ్లకు ఒక పిల్లను మాత్రమే పెంచుతాయి. దీంతో ఒక్క గూడు, గుడ్డును నష్టపోయినా ఆ జంటకు ఆ ఏడాది మొత్తం కొత్త తరం ఏర్పడే అవకాశం కోల్పోతుంది.20 నుంచి 160కి పెరిగిన రాబందులుకొన్నేళ్ల క్రితం అవ్కా-ఏటీటీలోకి బయటి ప్రాంతాల నుంచి వేటగాళ్లు రావడం ప్రారంభించడంతో స్థానికులు ఆందోళన చెందారు. రాబందుల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో ఇగ్వే నైజీరియా కన్జర్వేషన్ ఫౌండేషన్తో కలిసి రాబందుల సంరక్షణ కోసం ప్రచారం ప్రారంభించారు. మార్కెట్లు, బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు రాబందుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ అవగాహన కల్పించారు. అలాగే, స్థానిక నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, భద్రతా సిబ్బందిని కలుపుకుని బయటి వేటగాళ్లను అడ్డుకునే చర్యలు చేపట్టారు.స్థానిక నిబంధనలను కూడా అమలు చేయడంతో పరిస్థితి మారింది. దీంతో 2017లో అవ్కా-ఏటీటీలో సుమారు 20 రాబందులు మాత్రమే కనిపించగా.. ప్రస్తుతం 160కిపైగా రాబందులను గుర్తించినట్లు స్వచ్ఛంద కార్యకర్తలు చెబుతున్నారు.ఒక్క ఊరి ప్రయత్నం.. ప్రపంచానికి పాఠంరాబందుల అక్రమ రవాణాకు నైజీరియా ప్రధాన కేంద్రంగా మారిందని పరిరక్షణ సంస్థలు చెబుతున్నాయి. దేశంలోని జీవవైవిధ్యం, సరిహద్దుల వద్ద ఉన్న చెడు పరిణామాలు అక్రమ వ్యాపారానికి అనుకూలంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు. అక్రమంగా తరలిస్తున్న రక్షిత వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ.. కేవలం చట్టం అమలుతోనే సమస్య పరిష్కారం కాదని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజల్లో అవగాహన పెంచడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.అవ్కా-ఏటీటీ వంటి ప్రాంతంలోని స్థానికుల భాగస్వామ్యమే రాబందుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమైందని వారు చెబుతున్నారు. 'కనుమరుగైన రాబందులు దాదాపు తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ ప్రాంతాల్లో కూడా వాటిని చూస్తున్నాం. ఒకప్పుడు ఇవి పూర్తిగా కనిపించకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి' అని వల్చర్ కింగ్ ఇగ్వే చెబుతున్నారు. అలాగే, ప్రకృతి తన సహజ స్థితిలో కొనసాగేందుకు తాను పోరాడుతున్నానని ఆయన అంటున్నారు. ఒక చిన్న పట్టణం చూపించిన ఈ మార్గం.. ఆఫ్రికా అంతటా రాబందుల పరిరక్షణకు ఆశాకిరణంగా మారుతోంది. -
అంతరించిపోతున్న వన్యప్రాణులు
వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్లు పేర్కొంది. అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని వెల్లడించింది.అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వరల్డ్ వైల్డ్లైఫ్ ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్టు పేర్కొంది. 1970 నుంచి 2020 మధ్య కాలంలో సగటు జాతుల్లో 73శాతం తగ్గుదలను గుర్తించింది. అత్యధికంగా మంచి నీటిలో జీవించే జాతులు ఎక్కువ ప్రమాదానికి (85శాతం) అంతరించిపోయినట్టు స్పష్టం చేసింది. భూ సంబంధ జాతుల్లో 69శాతం, సముద్ర జాతుల్లో 56 శాతంగా ఉంది. ఇలా వన్యప్రాణులు అంతరించపోవడం 022(69శాతం)తో పోలిస్తే ఈ ఏడాది నాలుగు శాతం పెరగడం గమనార్హం. ఈ క్రమంలోనే జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ అందించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్లో 1970–2020 నుంచి 35వేలకుపైగా వన్యప్రాణుల జాతులు, 5,495 జాతుల ఉభయ చరాలు, పక్షులు, చేపలు, క్షీరదాలు, సరీసృపాలు అంతరించిపోయాయి. – సాక్షి, అమరావతిఅమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే ఎక్కువరెండువేల చెట్లు, 800 జంతుజాతులకు నిలయమైన అమెజాన్ రెయిన్ఫారెస్ట్లో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వేట కారణంగా పెద్ద పండ్లను తినే జంతువులను కోల్పోవడంతో, పెద్ద విత్తనాల వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. పగడపు దిబ్బల వంటి అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థల్లో కొన్నింటిని కోల్పోవడం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర జీవ వైవిధ్యం, తీర ప్రాంత రక్షణలకు పగడపు దిబ్బలు అవసరమని అభిప్రాయపడింది. గ్రీన్ ల్యాండ్, వెస్ట్ అంటార్కిటిక్లో మంచు పలకలు కరగడంతో పెద్ద ఎత్తున మీథేన్, కార్బన్ ఉద్గారాలు పెరిగేందుకు కారణమవుతోందని తెలిపింది.భారత్లో రాబందులు భారతదేశంలో మూడు రాబందు జాతులు అంతరించపోవడం నివేదిక ప్రమాదంగా భావిస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వైట్–రంప్డ్ వల్చర్ (తెల్ల రాబందు) 67శాతం, ఇండియన్ రాబందు 48శాతం, స్లెండర్–బిల్డ్ రాబందు (హిమాలయన్ రాబందు) 89 శాతం అంతరించినట్టు నివేదిక పేర్కొంది. వీటిని రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి పరిరక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తోంది. దేశంలో వన్యప్రాణులు అంతరించిపోతున్నా, కొన్ని ప్రాంతాల్లోని జీవజాతులను రక్షించడం, పునరుద్ధరించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు చురుగ్గా ఉన్నట్టు నివేదిక చెబుతోంది.అడవి పులులకు నిలయంగా భారత్ భారత్ ప్రపంచ వ్యాప్తంగా అడవి పులుల అత్యధిక జనాభాకు నిలయంగా ఉంది. ఆల్–ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 అంచనా ప్రకారం 3,682 పులులు ఉన్నట్టు తే ల్చింది. అలాగే మొట్టమొదటి మంచు చిరుత జనాభా అంచనానూ ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 718 మంచు చిరుతలను గుర్తించింది. ఆహార భద్రత ముప్పు జీవవైవిధ్య నష్టం, వాతావరణ సవాళ్ల కారణంగా 73.5 కోట్ల మంది ప్రజలు ప్రతి రాత్రి ఆకలితో పడుకుంటున్నారు. 90 శాతానికి పైగా పంట రకాలు కనుమరుగయ్యాయి. కేవలం 10 పంటలు (బార్లీ, సరుగుడు, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వరి, జొన్న, సోయాబీన్, చెరకు, గోధుమలు, రాప్సీడ్) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 83శాతం ఆహారాన్ని అందిస్తున్నాయి. మత్స్య సంపద నుంచి సంవత్సరానికి సుమారు 9 కోట్ల టన్నుల సీఫుడ్ అందుతోంది. ఇది 300 కోట్ల మందికి పైగా ప్రజలకు అవసరం. అయితే 37.7శాతం అధికంగా చేపలు పట్టడం వల్ల చేపల జనాభా క్షీణత, పగడపు దిబ్బలు దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1970–2020 వరకు వివిధ దేశాల్లో అంతరించిన వన్యప్రాణులు, ఉభయచరాలు, పక్షులు, చేపలు, క్షీరదాల జాబితా..» లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో95%» ఆఫ్రికాలో 76%» ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో60%» యూరప్లో మధ్యస్తంగా మధ్య ఆసియాలో 35%» ఉత్తర అమెరికాలో39% -
ఇవేం అంత్యక్రియలు? మృతదేహాలను రాబందులకు వదిలేస్తారా!
ఒక్కొ మతం సంప్రదాయానికి అనుగుణంగా అంత్యక్రియలు ఉంటాయి. హిందువలు దహనం చేస్తే, క్రిస్టియన్లు, ముస్లింలు ఖననం చేస్తారు. ఐతే పార్శీలు వద్దకు వచ్చేటప్పటికి అంత్యక్రియలు చాలా విభిన్నంగా ఉటాయి. వారి బంధువులు ఎవరైనా చనిపోతే రాబందులు తినడానికి వదిలిపెట్టేసి వెళ్లిపోతారట. ఇది వారి ఆచారం. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. అలా మృతదేహాలను వదిలేసే ప్రదేశాన్ని టవర్ అఫ్ సైలెన్స్ అంటారు. మనం ఎలా అయితే శ్మశానం నిర్మించుకుంటామో అలాగే పార్మీలు మృతదేహాలను విడిచిపెట్టే స్థలాలను టవర్ అఫ్ సైలెన్స్ పేరుతో ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకిలా? ఏంటీ ఆచారం అంటే.. పురాతనకాలం నుంచి పార్శీ కమ్యూనిటీ ఈ ఆచారాన్ని పాటిస్తోంది. దీన్ని 'దఖ్మా' అని కూడా పిలుస్తారు వారు. పార్శీలు వారి బంధువులు చనిపోయాక చేయాల్సిన చివరి కార్యక్రమాలు(అంత్యక్రియలు) ఇంత విడ్డూరంగా ఎందుకు చేస్తున్నారంటే?..వారి దృష్టిలో శరీరం ప్రకృతి ఇచ్చిన బహుమతని వారి నమ్మకం. అందుకే మరణాంతరం దాన్ని ప్రకృతికే సమర్పించాలనేది వారి ముఖ్యోద్దేశం. అందుకే వారంతా ఇలా చేస్తారు. ఐతే ఇక్కడో ఆసక్తకరమైన విషయం ఏంటంటే.. ఇలా మృతదేహాలను వదిలేసి ప్రదేశాన్ని.. టవర్ ఆఫ్ సైలెన్స్ పేరుతో పెద్ద ఖాళీ స్థలాన్ని ఎంచుకుని వృత్తాకారా రీతిలో రెండు పెద్ద గోడలు మధ్యలో ఓ పెద్ద బావి వచ్చేలా నిర్మిస్తారు. ఎవరైతే ఈ టవరాఫ్ సైలెన్స్ని నిర్మిస్తారో లేదా నిర్మించేందుకు విరాళం ఇస్తారో వారి శవమే ముందుగా ఇక్కడకు వస్తుందట. అందుకు ఆధారాలు ఉన్నాయని పార్శీ మతం గురించి పరిశోధన చేస్తున్నా ప్రాచి మహితా చెబుతున్నారు. కోల్కతాలో ఓ వ్యక్తి ఇలానే ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ని నిర్మించాడని, అప్పుడు ఆయన శవమే ముందుగా అక్కడకు వచ్చిందని చెబుతున్నారు. అలాగే ఆయనకు ఓ కుక్క ఉండేదని, అది ఆయన మీద బెంగతో తిండి మానేయడంతో అతను చనిపోయిన ఏడు రోజుకే ఈ కుక్క చనిపోయింది. దీన్ని కూడా అక్కడకే తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినట్లు ప్రాచి చెబుతున్నారు. రాబందువులకు ఆహరం కోసం అని ఇలా చేయడం లేదట వాళ్లు. జీవితం చివరల్లో కూడా దాతృత్యం ఉండేలని చాటి చెప్పేడమే ఈ వినూత్న రీతిలో చేసే అంత్యక్రియలు వెనుక దాగొన్న ప్రధానోద్దేశం. ముందుగా ఆ మృదేహాలు సూర్యుడికి, గాలికి బహిర్గతం అవుతాయి. ఆ తర్వాత రాబందులు లాంటివి పీక్కుని తినగా మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. ఈ బావికి వృత్తాకారంలో రెండు సర్కిళ్లు ఉంటాయి. బాహ్య సర్కిల్లో పురుషుల శవాలు. లోపల సర్కిల్లో మహిళ శవాలు. మధ్యన చిన్నపిల్లల మృతదేహాలను ఉంచుతారు. అవి డికంపోజ్ అయ్యాక మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. ఆ తర్వాత ఏడాదికి రెండేళ్లకొకసారి ఆయా వ్యక్తులు బంధువులు వెళ్లి మిగిలిపోయి ఉన్న అవశేషాలను సేకరించి డిస్పోజ్ చేస్తారు. వాళ్లు ఈ ప్రదేశానికి శవాన్ని తీసుకొచ్చేటప్పుడు తెల్లబట్టలు ధరించి మంత్రాలు జపిస్తారు. అలాగే టవర్ లోపలికి వెళ్లేటప్పుడూ అందరు ఒకేసారి బిగ్గరగా అరుస్తారు కూడా. ఈ టవర్లను నిర్మిచడానికి చాలా పెద్ద ఖాళీ స్థలం కావాల్సి ఉంటుంది. ఐతే ప్రస్తుత జనరేషన్ పార్శీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజుల్లో ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు నగరాల్లో రాబందులు కూడా ఎక్కువుగా లేవు. దీంతో సంవత్సరాలు తరబడి బహిర్గతమై ఉన్న శవాలు త్వరగా డిస్పోజ్ కావు పైగా కాలుష్యం ఏర్పడుతుంది. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు పార్శీలు ఆందోళన వ్యకం చేస్తున్నారు. ఈ ఆచారాన్ని మార్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కూడా. కానీ పలువురు పార్శీలు మాత్రం ఆఖరి టైంలో ఆ వ్యక్తులకు నిశబ్ధంగా ఇచ్చే గౌరవమని సగర్వంగా చెబుతుండటం గమనార్హం. (చదవండి: దసరా జరుపుకోని ఏకైక గ్రామం! కారణం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!) -
అదిగో అరుదైన ‘అతిథి’
సాక్షి, అమరావతి: అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన రాబందు బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల అటవీప్రాంతంలో కనిపించింది. స్థానికంగా ఎర్ర బొరవ (యూరేషియన్ గ్రిఫిన్)గా పిలిచే దీనిని పర్యావరణవేత్త, బర్డ్ వాచర్ జిమ్మీ కార్టర్ గుర్తించి తన కెమేరాలో బంధించారు. ఆఫ్రికా, యూరోప్లోని కొన్ని ప్రాంతాలు, మన దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఈ జాతి రాబందులు ఎక్కువగా కనిపిస్తాయి. దీని రెండు ఉప జాతుల్లో ఒకటి యూరోప్లో, రెండోది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. మైదాన ప్రాంతాలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొండల్లో గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తాయి. పశువుల కళేబరాల్లో డైక్లోఫినాక్ వంటి డ్రగ్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని తినడం వల్ల మన దేశంలో 95 శాతం అంతరించిపోయాయి. ఎప్పుడో ఒకసారి ఇలా కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ జాతి రాబందులు దక్షిణ భారత దేశంలోకి చాలా అరుదుగా వస్తాయి. రికార్డుల ప్రకారం ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే మన ప్రాంతానికి వచ్చినట్టు నమోదైంది. పదేళ్ల కిందట మొదటిసారిగా శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు వద్ద కనిపించగా, నాలుగేళ్ల కిందట గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద రెండోసారి కనబడినట్టు రికార్డుల్లో నమోదైంది. -
రాబందుల రెక్కలు విరిగాయ్
రాబందు.. ఈ పేరు వినడమే కానీ, వాటిని నిజంగా చూసిన వారు ఈ తరంలో తక్కువ మందే. అదికూడా జంతు ప్రదర్శనశాలలోనో లేదా సినిమాల్లో చూసి ఉంటారు. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షి జాతుల్లో రాబందులు ప్రధానమైనవి. కాలం విసిరిన సవాళ్లను ఎదుర్కోలేని స్థితిలో రాబందుల రెక్కలు విరిగిపోయాయి. ఆ జాతి క్రమంగా కనుమరుగైపోతోంది. ఈ పరిస్థితి పక్షి ప్రేమికులనే కాదు.. పర్యావరణ హితం కోరే వారినీ ఆందోళనకు గురి చేస్తోంది. సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని ప్రభావితం చేసే పక్షుల్లో కీలకమైన రాబందులు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రకృతిలో సహజ పారిశుధ్య నిర్వహణకు ఉపయోగపడుతూ.. ప్రకృతికి ఎంతో మేలుచేసే రాబందుల సంఖ్య మన దేశంలో కోట్ల నుంచి వేలకు పడిపోయింది. రాష్ట్రంలోనూ 95 శాతం రాబందులు ఉనికిలో లేకుండాపోయినట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల పర్యావరణ, అటవీ శాఖల సహకారంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్), కాశ్మీర్ యూనివర్సిటీ జువాలజీ విభాగం నిర్వహించిన పలు సర్వేలు దేశంలో రాబందు జాతుల్లో కొన్ని ఇప్పటికే అంతరించిపోయాయని.. మరికొన్ని అంతరించే దశకు చేరుకున్నాయని స్పష్టం చేస్తున్నాయి. జంతువుల మృత కళేబరాలను తినే రాబందులు.. ఆ కళేబరాలు కుళ్లిపోవడం వల్ల వ్యాధులు ప్రబలకుండా చూసేవి. కొన్నేళ్లుగా మారిన పరిస్థితులు వాటి మనుగడనే ప్రశ్నార్ధకం చేశాయి. 1980 కాలంలో మన దేశంలో 9 రకాల రాబందు జాతులు ఉంటే.. 1990 నాటికి మూడు జాతులు మాత్రమే మిగిలాయి. అప్పట్లో ఆ మూడు జాతుల జనాభా 4 కోట్ల వరకు ఉండగా.. 2005 నాటికి వాటి సంఖ్య 90 వేలకు.. 2017 నాటికి 19 వేలకు పడిపోయింది. ఇదే విషయాన్ని గత ఏడాది జూలై 19న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్సభలో ప్రకటించారు. మూడు జాతులే మిగిలాయి 1980 సంవత్సరానికి ముందు ప్రపంచంలో 23 రాబందు జాతులు ఉండగా.. వాటిలో తొమ్మిది రకాలు మన దేశంలో మనుగడలో ఉండేవి. ఆ తరువాత కాలంలో గణనీయమైన క్షీణత నమోదైంది. ప్రస్తుతం మన దేశంలో వైట్ బ్యాక్డ్, లాంగ్ బిల్డ్, స్లెండర్ బిల్డ్ అనే మూడు జాతులు మాత్రమే మిగిలాయి. వీటి మనుగడ కూడా క్లిష్ట దశలో ఉందని సర్వేలు తేల్చాయి. మన రాష్ట్రంలో ఒక్కటీ లేదు సాధారణంగా నదులు, కాలువలు, వాగులు కలిగిన కొండలు, గుట్ట ప్రాంతాల్లో రాబందులు నివసిస్తాయి. మన రాష్ట్రంలో రాబందుల ఉనికి లేదని సర్వేలు తేల్చాయి. కొన్నేళ్ల క్రితం వరకు నల్లమల, పాపికొండలు అటవీ ప్రాంతాలతోపాటు శ్రీశైలంలో రాబందులు కనిపించేవి. ప్రస్తుతం వాటి ఉనికి ఎక్కడా కనిపించడం లేదని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. అంతరించడానికి కారణాలివే.. డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లు ఇచ్చిన పశువుల మృత కళేబరాలను తినడం వల్లే దేశంలో రాబందుల సంతతి అంతరించిపోతున్నట్లు తేల్చారు. పశువులు తినే ఆహారంలో పురుగు మందుల ప్రభావం ఎక్కువై వాటికి వచ్చిన వ్యాధులు రాబందులపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి తోడు పర్యావరణ మార్పులు, ఆవాసాలు తగ్గిపోవడం, ఆహారం దొరక్కపోవడం, అవి నివసించే ప్రాంతాల్లో మానవ మనుగడ ఎక్కువ కావడం రాబందులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తక్షణ రక్షణ అవసరం పర్యావరణంలో రాబందులది కీలక పాత్ర. రాబందులు లేకపోవడం ప్రకృతిలో ఒక లోపమే. మారిన పరిస్థితుల్లో వాటి మనుగడ కష్టమైంది. అవి పూర్తిగా మాయం కాలేదు. అడవుల్లోనే కొద్ది సంఖ్యలో ఉంటున్నాయి. రాబందుల సంరక్షణ కేంద్రాలు కొన్నిచోట్ల ఉన్నా పెద్దగా ఫలితం లేదు. డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ల వాడకంపై నిషేధం ఉన్నా వినియోగం ఆగలేదు. ఆ ఇంజెక్షన్లను పూర్తిగా మానేయాలి. రాబందుల బ్రీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటికి మనుగడకు అడ్డంకులు లేకుండా చేయడం ద్వారా ఉన్న వాటినైనా కాపాడుకోవచ్చు. – దొంతి నరసింహారెడ్డి,పర్యావరణ పరిశోధకులు, హైదరాబాద్ -
ఎంత సక్కగున్నావే..!
కనురెప్పలతోనే మాయ చేస్తున్న ఓ విహంగమా.. నీ కళ్లను చూస్తే ఏ మగువైనా కుళ్లుకోదా..! రెప్ప వాల్చకుండా నిన్నే చూడాలనేంత అందం తన సొంతం.. తల వెనుక చూశారా ఈకలతో కిరీటం ధరించిన రాణిలా ఎలా హొయలు పోతోందో.. ఈ అందమైన గువ్వ పేరు సెక్రటరీ బర్డ్. రాబందులు, గద్దల జాతికి చెందిన ఈ పక్షి ఎక్కువగా పాములను వేటాడి ఆహారంగా తీసుకుంటుందట. ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఇవి ఉంటాయట. తన ఆహారం కోసం రోజూ 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తుందట. చాలా వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలి వెళుతుందట మన పక్షిరాజం. ఎంతైనా ఈ పక్షి కాస్త డేంజరసే సుమీ! -
పాలరాపు గుట్టల్లో గ్రిఫెన్ రాబందులు
పెంచికల్పేట్ (సిర్పూర్): కుమురంభీం జిల్లా పెంచికల్పేట మండలంలోని ప్రాణహిత, పెద్దవాగు సంగమ ప్రాంతంలోని నందిగామ వద్ద గల పాలరాపు గుట్టల్లోకి రెండు గ్రిఫెన్ రాబందులు వలస వచ్చాయి. ఇక్కడున్న పొడుగు ముక్కు రాబందుల సంరక్షణ కేంద్రంలో భిన్నంగా ఉన్న రెండు రాబందులను గుర్తించి ఉన్నతాధికారులకు వాటి ఫొటోలను పంపారు. వాటిని హిమాలయ పర్వతశ్రేణిలో నివాసం ఉండే హిమాలయన్ గ్రిఫెన్ రాబందులుగా గుర్తించినట్లు కాగజ్నగర్ ఎఫ్డీవో రాజారమణ రెడ్డి తెలిపారు. ఏటా శీతాకాలంలో నార్త్ ఇండియా హిమాలయాల నుంచి దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, ఏపీలోని కోస్తా ప్రాంతాలకు రాబందులు వలస వస్తుంటాయని అధికారులు తెలిపారు. కానీ తొలిసారిగా రాష్ట్రంలోని పాలరాపు గుట్ట వద్ద స్థావ రం ఏర్పరుచుకున్నాయని వివరించారు. ఇవి పొడుగుముక్కు రాబందుల కంటే పెద్దగా ఉన్నాయని, రోజూ వాటి దినచర్యను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
అరెవో సాంబ! షోలే థీమ్ పార్క్ ఎక్కడ?
బెంగళూరు: 1975లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన బాలీవుడ్ చిత్రం ‘షోలే’ గురించి తెలియని తరంగానీ, వినని తరంగానీ ఉండదేమో! అందులో ఏదో సీను, ఎప్పుడోసారి ప్రేక్షకుల మనోఫలకంపై ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అందుకనే బెంగళూరు–మైసూర్ మధ్య పర్యటించే పర్యాటకులు షోలే సినిమా షూటింగ్ జరిగిన కర్ణాటకలోని రామనగర ప్రాంతాన్ని సందర్శిస్తారు. ‘అదిగో ఆ పర్వతంపైనే, అక్కడే గబ్బర్ సింగ్ గుర్రంపై వచ్చి ఠాకూర్ బల్దేవ్ సింగ్ భార్య, పిల్లల్ని కాల్చి చంపుతాడు. ఈ పక్కన బల్దేవ్ సింగ్ ఇల్లు సెట్టింగ్ ఉండేది. అదిగో అల్లంత దూరాన ఠాకూర్ రెండు చేతులు నరికేసిన గబ్బర్ సింగ్ డెన్’ అంటూ దారినపోయే దానయ్యలెందరో ఇక్కడికొచ్చిన పర్యాటకులకు చెబుతుంటారు. ఈ రామనగరాన్నే సినిమాలో రామ్గఢ్గా వ్యవహరించారు. ఈ ప్రాంతాన్ని ‘షోలే’ థీమ్తోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసి సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కానీ అటవి శాఖ మాత్రం అందుకు అనుమతించడం లేదు. షోలే షూటింగ్ జరిగిన ప్రాంతం కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తోందని, తాము ఎట్టి పరిస్థితుల్లో పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేసేందుకు అనుమతించమని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఈ భూమంతా తమ రెవన్యూ శాఖ పరిధిలోనే ఉన్నందున షోలే థీమ్ పార్క్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెబుతున్నారు. ఇక్కడ షోలో సినిమాలో ఉన్నట్లుగానే గ్రామం సెట్టింగ్, గబ్బర్ సింగ్ గుడారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 120 ఎకరాల పరిధిలో ట్రెక్కింగ్, ఇతర సాహస క్రీడలను ప్రోత్సహించే సౌకర్యాలు, ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉంటాయని ఆయన చెప్పారు. రాబందుల సంరక్షణ కేంద్రం దేశంలో నానాటికి అంతరించిపోతున్న రాబందులను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడే 2012లో 346 హెక్టార్లలో ఓ శాంక్చరీని ఏర్పాటు చేసింది. భారత్, నేపాల్, పాకిస్థాన్ దేశాల్లో కనిపించే లాంగ్ బిల్డ్ జాతితోపాటు ఈజిప్టు, వీపు తెలుపురంగులో ఉండే మరోజాతి రాబందులు ఇప్పుడు ఈ శాంక్చరీలో ఉన్నాయి. భారత దేశంలో లాంగ్ బిల్డ్ జాతి రాబందులు 97 శాతం, ఈజిప్టు జాతి రాబందులు 99 శాతం నశించి పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ శాంక్చరీని ఏర్పాటు చేసింది. అభ్యంతరం పెడుతున్న పర్యావరణవేత్తలు షోలే థీమ్ పార్క్ను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేస్తే శాంక్చరీకి ముప్పు వాటిల్లుతుందని ఈ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పర్యావరణవేత్త శివనంజయ్య తెలిపారు. గబ్బర్ సింగ్ గుహ వాస్తవానికి సాంక్చరీ లోపల ఉన్నప్పటికి అక్కడికి పర్యాటకులను అనుమతించమని, శాంక్చరీ సరిహద్దు నుంచే ఆ గుహ గురించి చెబుతామని, పైగా శాంక్చరీకి పది కిలోమీటర్ల ఇవతల నుంచి నిర్మించే షోలే థీమ్ పార్కులోనే గబ్బర్ గుహను ఏర్పాటు చేస్తామని పర్యాటక మంత్రి ఖర్గే చెబుతున్నారు. రాబందులవి చాలా సున్నితమైన జీవితాలని, వాటికి సరిహద్దులు గుర్తించే తెలివితేటలు కూడా లేవని శివనంజయ్య అంటున్నారు. ఇప్పటికే శాంక్చరీ లోపలున్న రామ మందిరాన్ని సందర్శించేందుకు భక్తులు రావడం, అప్పుడప్పుడు ఉత్సవాలు జరపడం వల్ల రాబందులకు ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్యాసేజ్ టూ ఇండియా’ కూడా ఇక్కడ తీసిందే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డేవిడ్లీన్ తీసిన ‘ఏ ప్యాసేజ్ టు ఇండియా’ చిత్రం కూడా ఇక్కడ తీసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం షూటింగ్ను 1983–1984లో ఇక్కడ రామనగరలో నిర్వహించారు. అప్పడు ఇక్కడి పర్వతాలపై కొన్ని బండరాళ్లను బాంబులతో పగులగొట్టడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లిందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో తొలిసారిగా 1966లో జాన్బెర్రీ తీసిన జంగిల్ అడ్వెంచర్ చిత్రం ‘మాయా’ షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన రామ్ యెదేకర్ ఆ తర్వాత ‘షోలే’కు పనిచేశారు. యెదేకర్ సూచన మేరకే రమేష్ సిప్పీ షోలే షూటింగ్ను ఇక్కడ తీశారు. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి షోలో షూటింగ్ నాటి జ్ఞాపకాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని రాబందుల శాంక్చరీకి వాచ్మేన్గా పనిచేస్తున్న 60 ఏళ్ల వీరయ్య తెలిపారు. షూటింగ్ నాటికి 18 ఏళ్లు ఉన్న వీరయ్య ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను కూడా పోషించారు. అవసరమైనప్పుడల్లా గబ్బర్ సింగ్కు తుపాకీ తెచ్చియ్యడమే తన పాత్రని, ప్రభుత్వం థీమ్ పార్క్ను అభివద్ధి చేస్తే తాను గైడ్గా పనిచేస్తానని వివాదంతో సంబంధంలేని వీరయ్య చెప్పారు. షోలో థీమ్ పార్క్ అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలు కూడా వివాదాల కారణంగా ఫలించలేదు. ఈసారి ఎందుకో తమ ప్రయత్నాలు ఫలిస్తాయన్న ఆశతో ఉంది. -
రాబందులు లేక పర్యావరణానికి తీవ్ర ముప్పు
వాషింగ్టన్: అంతరించిపోతున్న రాబందులతో భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యావరణానికి, మానవాళికి తీవ్ర ముప్పు పొంచివుందని యుటా వర్సిటీ అధ్యయనంలో తేలింది. విషకారకాల వినియోగంతో ఇతర పక్షులు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం 88 శాతం రాబందులకు చెందిన పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ‘విషతుల్యమైన పశు కళేబరాలు తిని రాబందులు అంతరించిపోతున్నాయి. పశువులకు నొప్పిని నిర్మూలించేందుకు వినియోగించే డైక్లోఫినాక్ మందే ఇలా రాబందులు అంతరించిపోవడానికి కారణ’మని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశువుల కళేబరాల్ని తినే పక్షులు రకరకాల వైరస్, బ్యాక్టీరియాలను వ్యాప్తికి కారణమవుతున్నాయి. -
'ప్రతిశాఖలోనూ రాబందులు ఉన్నారు'
రాజమండ్రి: ప్రతి శాఖలోనూ రాబందులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యు ఎంప్లాయిస్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒకరిద్దరి గురించి మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగడం లేదన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యు కార్యాలయల్లో ఆర్ఎస్ఆర్- ఎస్ఎల్ఆర్ లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.


