breaking news
vitiligo
-
మచ్చ'లిక' మాయం
ఒంటిపైన తెల్లటి మచ్చలతో కనిపించే బొల్లి వల్ల ప్రాణహాని ఉండదు. కానీ ఒంటిపై తెల్లటి పొడలు మచ్చలు మచ్చలుగా కనిపిస్తుండటం వల్ల బాధితులు నలుగురిలోకి రావడానికి సామాజికంగా ఇబ్బంది పడతారు. అది అంటువ్యాధి కాదని తెలియక చాలామంది వాళ్ల పట్ల వివక్ష చూపుతారు. ఒక రకంగా చూస్తే మన సొంత వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) అన్నది మన సొంతకణాలపైనే దాడి చేసే ఆటో ఇమ్యూన్ సమస్య కూడా ఒక అంశం కావడంతో ఒకప్పుడు దీనికి అంతగా చికిత్స ఉండేది కాదు. అయితే ఇటీవల దీనికి మంచి మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్లో విటిలిగో అని పిలిచే ఈ బొల్లి వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం.ప్రాణహాని కలిగించకపోయినా వివక్షకు కారణమయ్యే ఈ వ్యాధి విస్తృతి మన జనాభాలోని దాదాపు 0.5 శాతం మందిలో కనిపిస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మచ్చలు... పాటర్న్స్ బట్టి వాటిల్లో రకాలు... ఈ బొల్లి మచ్చలు రకరకాల పాటర్న్స్లో కనిపిస్తాయి. ఉదాహరణకు కొందరిలో ఈ తెల్లమచ్చలు కొద్దిపాటి పొడల్లాగా వస్తాయి. అయితే వాటి సైజు పెరగదు. ఎప్పటికీ అవి చిన్నవిగానే కనిపిస్తుంటాయి. మరికొందరిలో మాత్రం ఇవి పెద్దవిగా విస్తరిస్తూ ఒక తెల్లమచ్చతో మరొకటి కలిసివపోడం వల్ల శరీరమంతా తెల్లబారి΄ోతుంది. ఆ పాటర్న్స్ కనిపించే తీరును బట్టి వీటిని మూడు రకాలుగా వర్ణించవచ్చు. ఫోకల్ పాటర్న్... ఈ తెల్లని మచ్చలు చర్మంలో ఏదో ఒకచోటికి మాత్రమే పరిమితం అవుతాయి.సెగ్మెంటల్ పాటర్న్... ఈ మచ్చలు శరీరమంతటా కాకుండా ఏదో ఒక వైపునకే... అంటే ముందువైపునకుగానీ లేదా వెనకవైపునకే పరిమితం కావడం. జనరలైజ్డ్ పాటర్న్... ఒక చోటికి మాత్రమే పరిమితం కాకుండా చర్మంపై అనేక ప్రాంతాలకు విస్తరించడం. అలాగే ఏదో ఒక వైపునకు మాత్రమే ఉండకుండా శరీరమంతటా కనిపించడం. ఈ తెల్లటి మచ్చలు సాధారణంగా చేతులు, వేళ్ల చివరలు, పాదాలు, భుజాలు, ముఖం, పెదవులు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. కొందరిలో బాహుమూలాలు, పొత్తికడుపు కింది భాగం, నోటి చుట్టూ, కంటి చుట్టూ, మర్మావయవాల ప్రాంతంలో ఉంటాయి. ఈ మచ్చలకు తోడు... విటిలిగో ఉన్నవారిలో ఆ తెల్ల మచ్చలు విస్తరించిన ప్రాంతంలో ఉండే వెంట్రుకలు (ఉదాహరణకు మాడు, కనురెప్పలు, కనుబొమలు, గడ్డంలోని ప్రాంతాల్లోనివి) తెల్లగా మారిపోతాయి. నల్లటి మేనిఛాయ ఉండే వారిలో ఈ తెల్లమచ్చలు / రంగు కోల్పోయిన ప్రాంతాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు... శరీరంపై ఉండే ఆ మచ్చల పరిమాణం, అవి వచ్చిన చోటు, అక్కడ అవి ఎంతమేర విస్తరించాయి... లాంటి అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అలాగే చికిత్స ప్రక్రియలు కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇక చికిత్సా ఫలితాలు కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో ఫలితం చాలా వేగంగా కనిపిస్తే, మరికొందరిలో చాలా ఆలస్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలివి... మెలనిన్ కణాలు మరింత నాశనం కాకుండా చూడటం : ఈ ప్రక్రియలో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ కణాలు మరింతగా నాశనమై΄ోకుండా చేస్తారు. అంతేకాదు... రంగు కోల్పోయిన శరీర భాగానికి మునుపటి రంగు వచ్చేలా చేస్తారు. స్టెరాయిడ్ క్రీములు : కొన్ని రకాల స్టెరాయిడ్ క్రీముల్ని పైపూతగా (టాపికల్ మెడిసిన్స్గా) వాడాల్సి ఉంటుంది. అవి చర్మానికి సాధారణ రంగు వచ్చేలా చేయడంతో పాటు మచ్చలు మరింత విస్తరించకుండా సహాయపడతాయి. అయితే అవి స్టెరాయిడ్స్ అయినందున వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను దృష్టిలో పెట్టుకుని వాటిని కచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. లేదంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఫొటో థెరపీ : ట్యాబ్లెట్లు, లోషన్ రూపంలోని సోరాలెన్స్ అనేవి ఈ తరహా చికిత్సలో ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యాబ్లెట్లు లేదా క్రీములను సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ వాడాలి. అయితే సూర్మరశ్మికి బదులుగా హానికరం కాని మోతాదులో అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ అయ్యేలా కూడా చేయవచ్చు. దీన్ని ‘పూవా’ థెరపీ అంటారు. మరికొంతమందికి న్యారో బ్యాండ్ అల్ట్రా వయొలెట్ – బి కిరణాలతోనూ, ఎక్సైమర్ లేజర్ అనే ఫొటో థెరపీ ప్రత్యామ్నాయాలూ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎక్సైమర్ లేజర్ను కొన్ని నిర్దిష్టమైన ప్యాచ్ల దగ్గరే ఉపయోగించడాని వీలుంది. ఈ ఫొటో థెరపీ ప్రక్రియల కోసం హాస్పిటల్కు రాలేని వారికి ఇంట్లోనే ఉపయోగించుకునేలా హోమ్ బేస్డ్ ఫొటో థెరపీ పరికరాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటిని డాక్టర్ చెప్పిన విధంగా మాత్రమే వాడాల్సి ఉంటుంది. డి–పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ : కొంతమందిలో దాదాపు 80 శాతం పైగా శరీరం తెల్లబడిపోతుంది. ఇలాంటివారిలో నల్లగా ఉన్న మిగతా ప్రాంతాన్ని కూడా తెల్లగా చేస్తారు. ఇతర ప్రక్రియలు : జింక్గో బైలోబా, లీవామీసోల్... లాంటివి ఇమ్యూన్ మాడ్యులేటర్స్. అంటే ఇవి బాధితుల్లో ఇమ్యూనిటీని పెంచడం ద్వారా విటిలిగోతో పోరాడతాయి. ఇవి టాబ్లెట్ల రూపంలోనూ లభ్యమవుతాయి. శస్త్రచికిత్స (సర్జికల్ ట్రీట్మెంట్): వీటిల్లో పంచ్ గ్రాఫ్టింగ్, స్ప్లింట్ స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి రకరకాల సర్జరీ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఇతరచోట్లలో ఉన్న రంగునిచ్చే పిగ్మెంట్ కణాలను (మెలనోసైట్స్ను)... అవి కోల్పోయిన ప్రాంతంల్లోకి బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇతరత్రా సాధారణ చికిత్సల వల్ల ఎలాంటి ఫలితాలూ రాని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స పద్ధతిని అవలంబిస్తారు. శరీరంలోని కొన్ని భాగాల్లో (అంటే... పెదవులు, చేతుల వేళ్ల చివరి భాగాలు, కాళ్ల చివరన ఉండే భాగాలకు) వచ్చిన మచ్చల విషయంలో సాధారణ చికిత్స ప్రక్రియలు అంతగా సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. అయితే పక్కలకు విస్తరించని విటిలిగో మచ్చలతో బాధపడే పేషెంట్ల విషయంలోనే ఈ శస్త్రచికిత్స విధానాన్ని ఆలోచిస్తారు. వ్యాప్తి చెందక΄ోవడం అంటే... ఒక ఏడాది వ్యవధిలో మచ్చ సైజు విస్తరించక΄ోవడం, కొత్త ప్రాంతాల్లో మచ్చలు రాకపోవడాన్ని మచ్చలు వ్యాప్తిచెందని పేషంట్లుగా పరిగణిస్తారు. ఈ సర్జికల్ ప్రక్రియలో ఇతర చోట్ల నుంచి చర్మాన్ని తీసుకుని గ్రాఫ్ట్ చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన ఆధునిక శాస్త్రవిజ్ఞాన ప్రక్రియల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మెంట్ వచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకుగాను... సర్జరీ తర్వాత సాధారణ వైద్యచికిత్స కూడా అవసరం కావచ్చు. చివరగా... ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల వల్ల విటిలిగో రోగులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరంగాని, బాధపడాల్సిన పరిస్థితిగాని లేదు. అనేక వినూత్న చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందున వాటి సాయంతో మళ్లీ మేని రంగును మామూలుగా మార్చుకునేందుకు చాలా అవకాశాలున్నాయి. బొల్లి వ్యాధి కారణాలు ఏమిటంటే... మానవ చర్మంలోని మెలనోసైట్స్ అనే కణాల్లో రంగును ఇచ్చే పిగ్మెంట్ను కలిగి ఉంటాయి. ఈ రంగునిచ్చే పిగ్మెంట్ వల్లనే పదార్థం వల్ల మేనికి రంగు సమకూరుతుంది. ఉదాహరణకు ఒకరి చర్మంలో మెలనోసైట్స్లో పిగ్మెంట్ మోతాదులు ఎక్కువగా ఉంటే వాళ్ల చర్మం నలుపు మొదలుకొని, తక్కువగా ఉన్నవారి చర్మం తెల్ల రంగు (ఫెయిర్) వరకు రకరకాల షేడ్స్లో మేని రంగు ఉంటుంది. ఈ మెలనోసైట్స్ అన్నీ ఒకేచోట కుప్పగా ఉన్నప్పుడు అక్కడ నల్లటిరంగు పుట్టుమచ్చ వస్తుంది. ఏదైనా కారణాల వల్ల ఒకరి చర్మంలో ఈ మెలనోసైట్స్ దెబ్బతినడం వల్ల అక్కడి పిగ్మెంట్ లోపించినప్పుడు అక్కడి చర్మం తన సహజమైన రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. ఇలా చర్మపు రంగు లోపించడానికి... రంగును ఇచ్చే పదార్థమైన పిగ్మెంట్లోని కణాలను సొంత వ్యాధి నిరోధకత దెబ్బతీయడం (ఆటోఇమ్యూన్ అంశం) కూడా ఒక కారణం కావచ్చు.ఈ వ్యాధిగ్రస్తుల్లోని చాలామందిలో ఇది జన్యుపరంగా వచ్చే అవకాశాలెక్కువ. ఇక మరికొందరిలో ఏ కారణమూ లేకుండానే ఇది కనిపించవచ్చు. కారణం ఏదైనా బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచులు ప్యాచులుగా కనిపిస్తాయి. ఇంగ్లిష్లో దీన్ని విటిలిగో అని పిలుస్తారు. వైద్య పరిభాషలో దీన్ని ‘ల్యూకోడెర్మా’ అంటారు.ఈ మచ్చలు హాని కలిగించవు కానీ... ఈ విటిలిగో మచ్చల్లో ఎలాంటి నొప్పీ ఉండదు. వీటి కారణంగా ఆరోగ్యానికి సైతం హాని కూడా ఏదీ ఉండదు. కానీ చూడటానికి (లుక్స్ పరంగా) ఇది ఏమాత్రం బాగుండదు. కాబట్టి ఎంతగా హానికరం కాక΄ోయినప్పటికీ ఈ వ్యాధి కారణంగా బాధితులు వివక్షకు ఆత్మన్యూనతకూ లోనయ్యే అవకాశాలూ ఎక్కువే.డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ (చదవండి: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..?)డా‘‘ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ -
తమన్నా బాయ్ ఫ్రెండ్ విటిలిగోను దాచిపెట్టాడట: దీనికి చికిత్స ఉందా?
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా ప్రియుడు నటుడు విజయ్ వర్మ సంచలన విషయాన్ని ప్రకటించాడు. తనకు విటిలిగో(బొల్లి) అనే చర్మ వ్యాధి ఉందని అయితే దాన్ని దాచి పెట్టానని చెప్పుకొచ్చాడు. విజయ్ వర్మ తాజాగా మీడియాతో మాట్లాడుతూ “నా సినిమాల కోసం దాన్ని దాచిపెట్టాను. ఎందుకంటే అది ప్రేక్షకుల దృష్టి మరల్చుతుంది. నా నటన తప్ప మరేదో చూడాలని నేను కోరుకోను, అందుకే నేను దానిని దాచాను. ఇన్నాళ్లు దీన్ని దాచినందుకు ఎప్పుడూ బాధపడలేదు. ఈ నేటి తరం చాలా తెలివైన వారు. అర్థం చేసుకుంటారు. వారికి ఆ బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ” అని వెల్లడించాడు.ఇది కేవలం కాస్మెటిక్ విషయమే. అయినా మొదట్లో చాలా భయపడ్డాను, సక్సెస్ అందుకున్న తరువాత దాని గురించి ఆలోచించడం మానేసాను అని తెలిపాడు. గల్లీ బాయ్ నటుడు. బొల్లి (vitiligo)వ్యాధి అంటే ఏమిటి? ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చర్మం మీద సహజంగా ఉండే రంగు పోవడం, తెల్లటి ప్యాచెస్ లేదా మచ్చలు ఏర్పడడాన్నే విటిలిగో లేదా బొల్లి అంటారు. వంశపారంపర్య కారణాలతో పాటు, ఇనేక ఇతర కారణాలవల్ల ఇది వస్తుంది. చర్మంలో ఉండే మెలనోసైట్లుగా పిలిచే మెలనిన్(melanin) కణాల స్థాయి క్షీణించినపుడు చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నే బొల్లి అంటారు. ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు.ఇందులో చాలా రకాలున్నాయి. ప్రధానంగా సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ అని ఉంటాయి. శరీరంలో ఒక్క భాగంలో మాత్రమే ఉంటే దాన్ని సెగ్మెంటల్ అని, అలా కాకుండా చాలాచోట్ల ఉంటే నాన్ సెగ్మెంటల్ అని అంటారు. బొల్లి రకం, దాని వ్యాప్తిని బట్టి చికిత్స ఆధార పడి ఉంటుంది.అయితే బొల్లి వ్యాధి సోకిన వారిలో మానసిక కుంగుబాటు,ఆందోళన ఒత్తిడి లాంటి సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో మందులతోపాటు, బాధితులకు భరోసా ఇవ్వడం, మానసిక స్థైరాన్ని కల్పించడం చాలా అవసరం. చికిత్సదీర్ఘ కాలంపాటు చికత్స తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మెలోనిన్ చికిత్స, అల్ట్రావైలెట్ లైట్ చికిత్సను సిఫార్సు చేస్తుంటారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ మేరకు కార్టికోస్టెరాయిడ్ క్రీమ్లు నారో-బ్యాండ్ అల్ట్రా వైలెట్ B చికిత్స (Narrow-band ultraviolet B therapy) ఫోటోకీమోథెరపీ (Photochemotherapy), లేజర్ చికిత్స శస్త్ర చికిత్స ద్వారా చర్మం మార్పిడి లాంటివి అందుబాటులో ఉన్నాయి. -
బొల్లి వ్యాధి బయటకు రానివ్వకుండా కుంగదీసినా..కళ గెలిపించింది!
స్కూలు అకడమిక్ పరీక్షల్లో కాస్త వెనకబడితేనే కుంగిపోతుంటారు. పిల్లలు. అలాంటిది పదేళ్ల వయసులో తన శరీరం మీద తెల్లని మచ్చలు రావడం చూసిన ఆశా ఖత్రికి ఏమీ అర్థం కాలేదు. తన స్నేహితులు, చుట్టుపక్కల వారి శరీరం మీద అలాంటి మచ్చలు ఏవీ కనపడకపోవడంతో తను ఏదో ప్రత్యేకంగా ఉన్నట్లు భావించి.. అందరిలా తను లేదని చాలా బాధపడింది. తనకొచ్చిన బొల్లి మచ్చలు పోవడం లేదని తీవ్ర నిరాశకు లోనైంది. ఏది ప్రయత్నించినా తనకి ఎదురే వచ్చాయి. అయినా తన చిన్ననాటి అలవాటునే ఉజ్వల భవిష్యత్గా మార్చుకుని, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ముఫ్పైరెండేళ్ల ఆశాఖత్రి. రాజస్థాన్లోని చిత్తోర్ఘర్కు చెందిన ఆశా ఖత్రి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు మిగతా పిల్లల్లా కాకుండా ఒళ్లంతా తెల్లని మచ్చలతో కొంచెం అసాధారణంగా ఉండేది. తన రూపాన్ని చూసుకుని చిన్నారి ఆశా చాలా కుంగిపోయింది. అది గమనించిన తల్లిదండ్రులు, స్నేహితులు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆమెలో ధైర్యాన్ని నింపుతూ, వైద్యం చేయించేవారు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినప్పటికీ పెద్ద మార్పు రాలేదు. కుంగిపోయినప్పటికీ... తన పరిస్థితి చూసుకుని ఎప్పుడూ బాధపడే ఆశ.. మందులు, హార్మోన్లలో మార్పుల వల్ల విపరీతమైన బరువు పెరిగిపోయింది. దీంతో సమాజంలో తిరగాలంటే చాలా బిడియంగా ఉండేది తనకు. అంగవైకల్యం ఉన్న అమ్మాయిలా అందరూ తనని చూసేవారు. ఇంత బాధలోనూ ధైర్యం తెచ్చుకుని ఎం.ఏ., బీఈడీ. చేసింది. చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది. సంవత్సరాలపాటు కష్టపడినప్పటికి కాలం కలిసిరాక ఉద్యోగం రాలేదు. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్లమీద తనే నిలబడాలనకునే ఆశ.. ఏదోఒకటి చేసి సంపాదించాలన్న కోరికతో రకరకాలుగా ప్రయత్నిస్తూ చివరికి క్రొచెట్ను ఎంచుకుంది. అలవాటునే సంపాదనగా... క్రొచెట్ టాయిస్ను తయారు చేసే కళ ఒక తరం నుంచి మరోతరానికి బదిలీ అవుతుంటుంది. ఆశ చిన్నప్పుడు అల్లికలతో బొమ్మలు తయారుచేసే క్రొచెట్కళను తన అమ్మ, అమ్మమ్మల దగ్గర నేర్చుకుంది. వివిధ రకాల బొమ్మలు చేస్తుండేది. ఆ అలవాటే తన డెస్టినీ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అనేకప్రయత్నాలు విఫలం అయ్యి దిక్కుతోచని రోజులవి. అది 2021 నవంబర్. ఒకరోజు ఆశ...తన చుట్టాల పిల్లలు క్రొచెట్ టాయిస్తో ఆడడం చూసింది. క్రొచెట్ టాయిస్తో ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉండడం గమనించిన ఆశ.. తను కూడా ఆ టాయిస్ను తయారు చేసి ఆన్లైన్లో విక్రయించవచ్చన్న ఆలోచన వచ్చింది. అనుకున్న వెంటనే తనకు తెలిసిన క్రొచెట్ కళతో చిన్న ఆక్టోపస్ను తయారు చేసి అందరికి చూపించింది. అది చూసిన వారంతా చాలా బావుంది. క్యూట్గా ఉంది అని చెప్పడంతో.. మరికొన్ని టాయిస్ తయారు చేసి, ఎగ్జిబీషన్లో ప్రదర్శించింది. అక్కడ ఆ టాయిస్ను చూసిన వారంతా ఇష్టపడి కొనడం, ఆశకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తన బొమ్మలకు వస్తోన్న ఆదరణను చూసి మరిన్ని టాయిస్ను రూపొందించి చిన్నచిన్న ఎగ్జిబిషన్లలో విక్రయించేది. అక్కడ వచ్చిన స్పందనతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. తను తయారు చేసే టాయిస్ను ఇన్స్టాగ్రామ్, ఇంకా వెబ్సైట్ ఆశి. టాయిస్.స్టూడియో పేరిట విక్రయిస్తోంది. రెండువేలకుపైగా బొమ్మలు అమ్ముడయ్యాయి. ఆశ టాయిస్కు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి ఇల్లు,ఆఫీసు అలంకరణకు వాడే వివిధ రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. జైపూర్లో బాగా పాపులర్ అయిన ‘‘టాటూ కేఫ్’’ కు డ్రీమ్ క్యాచర్స్ను తయారు చేసి ఇవ్వడం విశేషం. ఒకపక్క బొల్లి, మరోపక్క అధిక బరువు ఉన్నప్పటికీ... తన టాలెంట్తో అందమైన క్రొచెట్ టాయిస్ను రూపొందిస్తూ కస్టమర్ల మనసులు గెలుచుకుంటోంది ఆశాఖత్రి. దారులన్నీ మూసుకు పోయినప్పటికీ... ఏదో ఒకదారి తెరిచే ఉటుంది. ఒపిగ్గా ఆ దారిని వెతికి పట్టుకుంటే బంగారు భవిష్యత్కు మార్గం సుగమం అవుతుందనడానికి ఆశాఖత్రి ఉదాహరణగా నిలుస్తోంది. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్గా మార్చింది! అదే ఆమెను..) -
‘విటిలిగో’ వ్యాధితో బాధపడుతున్న మమతా మోహన్దాస్..లక్షణాలు ఇవే!
తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు.. తెరవెనుక ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి ఆర్థిక, మానసిక సమస్యలు అయితే మరికొందరికి అనారోగ్య ఇబ్బందులు. అయినా కూడా వినోదాన్ని అందించడంలో మాత్రం వారు వెనుకడుగు వేయడం లేదు. అరుదైన రోగాలను సైతం ధైర్యంగా ఎదుర్కొని చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన.. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకున్న మమతా మోహన్దాస్.. తాజాగా మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడ్డారు. తాను ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటో చూద్దాం. ‘విటిలిగో’ ఎందుకు వస్తుంది? చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని ఈ వ్యాధి వస్తుంది. బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. రంగు కాస్త తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారికి సోకే అవకాశం ఉంది. మానసిక కుంగుబాటు, రసాయన ప్రభావాలకు గురి కావడం, ఎండకు అధికంగా ఎక్స్ పోజ్ కావడం వల్ల కూడా బొల్లి వ్యాధి రావొచ్చు. ఇది ప్రమాదమేమీ కాదు. ప్రాణాపాయం కూడా కాదు. లక్షణాలు ఏంటి? ఈ వ్యాధి సోకిన వారి చేతులు, ముఖం, జననేంద్రియాల చుట్టూ తెల్లని పాచెస్ కనిపిస్తాయి. తల, వెంట్రుకలు, కనుబొమ్మలు, గడ్డం మీద జుట్టు తెల్లబడుతుంది. నోరు, ముక్కు లోపలి భాగంలో కణజాలాలలో రంగు మారుతంది. చికిత్స ఏంటి? ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. కానీ బొల్లి వ్యాప్తిని ఆపడానికి మాత్రం చికిత్స ఉంది. బొల్లి లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తెల్లని మచ్చలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న సమయంలోనే చికిత్స అందించాలి. యూవీ థెరపీ, స్టెరాయిడ్ క్రీమ్స్, ఫోటో కీమో థెరపీ ద్వారా తెల్లటి మచ్చలను తగ్గించొచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే శాశ్వత నివారణ సాధ్యం కాకపోవచ్చు. గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్య నిపుణులు, పలు అధ్యాయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే సరైన నిర్ణయం. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
తెల్లమచ్చల నివారణకు డాక్టర్ రెడ్డీస్ లోషన్
5ఎంఎల్ బాటిల్ ధర రూ. 709 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శరీరంపై ఏర్పడే తెల్లమచ్చల(బొల్లి) వ్యాధిని తగ్గించే లోషన్ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. మెల్గెయిన్ పేరుతో విడుదల చేసిన ఈ లోషన్ను వినియోగిస్తే మూడు నెలల్లో మచ్చలు తగ్గి శరీరం రంగులోకి కలిసిపోతాయని డాక్టర్ రెడ్డీస్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మెల్గెయిన్ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. దేశంలో 5 కోట్లమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, ఇందులో 55 శాతం మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యిందన్నారు. ఇస్సార్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ఈ లోషన్ను డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తుందని, 5ఎంఎల్ బాటిల్ ధరను రూ. 709గా నిర్ణయించినట్లు అలోక్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో డెర్మటాలజీ విభాగంలో డాక్టర్ రెడ్డీస్ను టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు.


