-
అనంతపురం అర్బన్ బ్యాంక్ 12 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు
-
ముగ్గురు ఖాతాదారులు పరార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసి నగదు కొల్లగొట్టాలనే కుట్రకు గతేడాదే బీజం పడినట్లు తేలింది. దీనికోసం ప్రత్యేకంగా రెండు ఖాతాలు తెరిపించిన సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉన్న మరో ఖాతాను వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఖాతాదారులు పరారీలో ఉండటంతో వీరి సహకారంతోనే సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వేర్వేరు సమయాల్లో తెరిచిన ఖాతాలు మహేష్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టడానికి పథకం వేసిన సైబర్ నేరగాళ్లు రెండు నెలల క్రితమే రంగంలోకి దిగారు. అత్తాపూర్, సిద్ధిఅంబర్ బజార్లో ఉన్న బ్రాంచ్ల్లో రెండు ఖాతాలు తెరిపించారు. గత నెల 23న నాగోల్లోని శాన్విక ఎంటర్ప్రైజెస్ పేరుతో, ఈ నెల 11న షానవాజ్ బేగం పేరుతో కరెంట్, సేవింగ్ ఖాతాలు తెరిచారు. హుస్సేనిఆలంలో హిందుస్తాన్ ట్రేడర్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్న వినోద్కుమార్కు ఈ బ్యాంక్లో 2020 జూన్ నుంచి కరెంట్ ఖాతా ఉంది. ఈ మూడు ఖాతాలను సైబర్ నేరగాళ్లు చెస్ట్ ఖాతాలోని రూ.12.4 కోట్లు మళ్లించడానికి వినియోగించుకున్నారు. షానవాజ్ బేగం ఖాతా తెరిచే సమయంలో గోల్కొండ చిరునామా ఇచ్చినప్పటికీ... ఆమెను ముంబైకి చెందిన మహిళగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈమెను నగరానికి పంపడం ద్వారానే శాన్విక ఎంటర్ప్రైజెస్తో ఖాతా తెరిపించడంతోపాటు వినోద్కుమార్ ద్వారా హిందుస్తాన్ ట్రేడర్స్ ఖాతా వాడుకునేలా ఒప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉండటం అనుమానాలకు ఊతమిస్తోంది. సర్వర్ హ్యాకింగ్కు సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ ద్వారా యాక్సెస్ చేశారు. వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అవి అమెరికా సంస్థ ద్వారా జనరేట్ అయినట్లు తేలింది. వాటి మూలాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ను కొల్లగొట్టడంలోనూ ఇదే పంథా అనుసరించారు. ఈ నేపథ్యంలో నైజీరియన్ల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. -
Muddasani Kanakaiah: మూగబోయిన పోరాట గొంతుక
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించి, పలు రాజకీయ పార్టీల్లో తనదైన ముద్ర వేసిన ముద్దసాని కనకయ్య(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1970లో రాడికల్ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పని చేశారు. తర్వాత కాంగ్రెస్, బీఎస్పీ, టీఆర్ఎస్ పార్టీల్లో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి ఉద్యమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారు. నాడు దొరల, భూస్వాముల, గడీల పాలనకు చరమగీతం పాడేందుకు విద్యార్థి ఉద్యమాన్ని నడిపారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్టయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్, మాజీ మేయర్ డి.శంకర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ లాంటి ప్రముఖులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పని చేశారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ సంతాపం.. ముద్దసాని కనకయ్య మృతి బాధాకరమని, ఎన్నో ఏళ్లు అనేక ఉద్యమాల్లో సహచరుడిగా ఉన్న ఆయన దూరమవ్వడం తాడిత, పీడిత ప్రజలకు తీరనిలోటని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్లు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
లాభాల బాటలో అర్బన్బ్యాంకు
కరీంనగర్కల్చరల్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు లాభాల బాటలో ఉందని ఆ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తెలిపారు. నగరంలోని కృషిభవన్లో ఆదివారం బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.254 కోట్ల లావాదేవీలు నిర్వహించగా రూ.1.06లక్షలు లాభం ఆర్జించినట్లు తెలిపారు. నికర లాభం రూ.61,99,989 కోట్లు వచ్చిందని దీనికి గాను రూ.44 లక్షల ఆదాయపు పన్ను చెల్లించినట్లు వివరించారు. గతేడాది రూ.83 లక్షల లాభం ఆర్జించగా నికరలాభం రూ.54,84,625 వచ్చినట్లు తెలిపారు. ఇందుకుగాను రూ.28 లక్షల ఆదాయపు పన్ను చెల్లించినట్లు చెప్పారు. బ్యాంకు సీఈవో జి.చంద్రమౌళితో పాటు సభ్యులు పాల్గొన్నారు. -
నామినేషన్లో గందరగోళం
మిత్ర పక్ష బీజేపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి ఏకపక్షంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ టీడీపీ దౌర్జన్యకాండను ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కొరిటెపాడు (గుంటూరు) : అర్బన్ బ్యాంకు పాలకవర్గ పదవులకు సంబంధించి బుధశారం నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్కు తుది గడువుగా ఉంది. దీంతో చైర్మన్ పదవిని ఆశిస్తూ బరిలో ఉన్న టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్న బీజేపీ నేత, బ్యాంకు మాజీ చైర్మన్ ఆర్తిమళ్ళ వెంకటరత్నం ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలతో కలిసి బ్యాంకు చేరుకున్నారు. ఈక్రమంలో టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు, నాయకులు నామినేషన్ వేయడానికి లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ మధ్య ఘర్షణ తలెత్తింది. చివరకు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నగర మాజీ ఉపాధ్యక్షుడు ఈదర శ్రీనివాసరెడ్డిపై దాడిచేశారు. దీంతో నామినేషన్లు వేయకుండానే బీజేపీ అభ్యర్థులు వెనుదిరిగారు. అనంతరం భారతీయ జనతా పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో సిట్టింగ్ చైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లగా టీడీపీ శ్రేణులు అడ్డుకుని ఎమ్మెల్యేల వద్దకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల జోక్యంతో కొత్తమాసు నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయారు. టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు ఈ సందర్భంగా అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడుతూ ఇప్పటి వరకు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పని చేసిన కొత్తమాసు శ్రీనివాసరావు బ్యాంక్ను అభివృద్ధి బాటలో నడిపించారని తెలిపారు. దీంతో ఏకీభవించని టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిందని ఈ మిగిలిన మూడు సంవత్సరాలు చైర్మన్ పదవిని తమకు వదలి వేయాలని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నుంచి బోనబోయిన శ్రీనివాసయాదవ్, బీజేపీ నుంచి వెంకటరత్నం నామినేషన్లు వేశారు. బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులతోపాటు నాయకులు నేరేళ్ళ మాధవరావు, చెరుకూరి తిరుపతిరావు, శిఖాకొల్లి అభినేష్, జగన్మోహన్రావు, తోట రామకష్ణ, కె.వి.సుబ్బారావు తదితరులు ఉన్నారు. దౌర్జన్య కాండను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ తెలుగుదేశం పార్టీ అడ్డగోలు రాజకీయం, దౌర్జన్యకాండను వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫాలతో పాటు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు తరలి వచ్చారు. బ్యాంకులోకి ఎవ్వరిని వెళ్లనీయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బ్యాంకులోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అప్పిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలతో వాదనకు దిగారు. అనంతరం బ్యాంకులోకి వెళ్ళి ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికల్లో ఇలా అడ్డుకునే ధోరణి సరి కాదని, ఈ విధంగావ్యవహరిస్తే తాము న్యాయ పోరాటం చేసి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించారు. పార్టీ నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, అంగడి శ్రీనివాస్, గులాం రసూల్, జగన్ కోటి, ఎలికా శ్రీకాంత్యాదవ్, కోట పిచ్చిరెడ్డి, ఆరుమండ్ల కొండారెడ్డి, పూనూరి నాగేశ్వరరావు, దాసరి కిరణ్, అంగడి శ్రీనివాసరావు, దుగ్గింపూడి యోగేశ్వరెడ్డి, కె.ప్రేమ్కుమార్, మొహమూద్, బడావీరు నాగరాజు, తోట మణికంఠ, కీసర వెంకటసుబ్బారెడ్డి, మేరుగ నర్సిరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, గనిక జాన్సీరాణీ, నిమ్మరాజు శారదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement