-
కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు శాశ్వతంగా పోవాలంటే..?
మన ఏజ్ ఎంత? అని చెప్పేసేవి మన కళ్లే. వయసు చిన్నదైనా సరే మన కళ్లు కింద నలుపు ఉండి, ముడతులు వచ్చాయా అంతే పెద్దొళ్లుగా కింద ట్రీట్ చేసేస్తారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దగ్గర నుంచి ఆఫీస్లో పనిచేసే మహిళల వరకు అందర్నీ వేధించే సమస్యే ఇది. ధైర్యం చేసే ఏమైనా రాద్దాం అంటే కళ్లు కదా! ఏదైన సమస్య వస్తుందని భయపడుతుంటా. అలాంటి వాళ్లంతా ఇలా చేస్తే ఆ సమస్యకు సులభంగా చెక్పెట్టొచ్చు. కళ్లకింద ఏర్పడిన నల్లటి వలయాలు, ముడతలు, మచ్చలు అందమైన ముఖారవిందాన్ని పాడుచేస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే... రాత్రి పడుకునేముందు కొద్దిగా అలోవెరా జెల్ను తీసుకుని కళ్ల కింద రాసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి. విటమిన్ ఇ ఆయిల్ కొల్లాజెన్ బూస్టర్గా పనిచేసి కళ్లకింద రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడు తుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్ను కళ్లకింద రాసి మర్దన చేయాలి. పై రెండూ అందుబాటులో లేని వారు కనీసం కొబ్బరి నూనెను అయినా కళ్లకింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లోనే ముడతలు, మచ్చలు పోయి ముఖారవిందం బాగుంటుంది. (చదవండి: చలికాలంలో జుట్టు పొడిబారి డల్గా ఉంటుందా? ఈ టిప్స్తో సమస్యకు చెక్పెట్టండి!) -
ఆపరేషన్ క్లీన్ మనీ: 9లక్షల ఖాతాలు సందేహాస్పదం
న్యూఢిల్లీ: 'ఆపరేషన్ క్లీన్ మనీ' ప్రక్రియలో ఇటీవల ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా వివరణకు ఇచ్చిన గడువు (ఫిబ్రవరి 15) ముగియడంతో తదుపరి చర్యలకు దిగుతోంది. ఈ మేరకు రద్దయిన నోట్ల డిపాజిట్లపై ఇటీవల గుర్తించిన 18 లక్షల అనుమానాస్పద ఖాతాల్లో దాదాపు సగం ఖాతాలపై ఆదాయపన్ను శాఖ అనుమానాలను వ్యక్తం చేసింది. 9 లక్షల ఖాతాల్లో బ్యాంకు డిపాజిట్లను 'సందేహాస్పదంగా' గుర్తించినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. అయితే కొత్త పన్ను అమ్నెస్టీ పథకం మార్చి 31 న ముగిసిన అనంతరం ఈ ఖాతాలపై చర్యకు దిగనునున్నట్టు ప్రకటించింది. ఆపరేషన్ క్లీన్ మనీ లో భాగంగా డీమానిటైజేషన్ 50-రోజుల కాలంలో రూ.5 లక్షలకు పైన అనుమానాస్పద డిపాజిట్లపై ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా 18 లక్షలమందిని ఆరాతీసింది. వీరిలో చాలా మంది ఫిబ్రవరి 12దాకా తమకు సమాధానాలు ఇచ్చినట్టు చెప్పింది. అయితే వీటికి సమాధానం చెప్పని ఖాతాదారులు , సరియైన న్యాయపరమైన వివరణ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని ఐటీ వర్గాలు ప్రకటించాయి. తమ నోటీసులకు ప్రత్యుత్తరం పంపనివారికి లేదా ఐటిఆర్ వెల్లడిపై ఉద్దేశపూర్వకంగా కట్టుకథలు చెప్పేవారిపై కచ్చితంగా చర్య తీసుకోబడుతుందన్నాయి. 2016-17 ఆదాయ రిటర్న్స్ తోనే సరిపోలనీ, లేదా గడచిన సంవత్సరాలలో ఆదాయంలో అసాధారణ పెరుగుదల ఉంటే వాటిని అక్రమ ఆస్తులు, లేదా నల్లధనం కింద పరిగణిస్తామని స్పష్టం చేశాయి. అలాగే ఇ-ఫైలింగ్ పోర్టల్ రిజిస్టర్ కాని సుమారు 4.84లక్షల పన్నుచెల్లింపుదారులకు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఎస్ఎంఎస్ లు పంపినట్టు తెలిపింది. అయితే ఎస్ ఎంఎస్ ఇ-మెయిల్ చట్టపరమైన నేపధ్య లేని నేపథ్యంలో, అధికారిక నోటీసులు పంపడానికి, తదుపరి చర్యలు మార్చి 31 వరకు వేచి ఉంటామని తెలిపింది. ఆపై సందేహాస్పద డిపాజిట్లపై చర్యలుంటాయని తెలిపింది. ఆదాయ వెల్లడికి ఉద్దేశించిన పథకం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మార్చి 31 వరకు నడుస్తుంది కాబట్టి , ఈ లోపు సంపదను వెల్లడించి పన్నులు చెల్లించాస్తారా లేదా అనేది డిపాజిటర్లు తేల్చుకోవాలని పేర్కొంది. కాగా రద్దయిన నోట్ల డిపాజిట్లపై 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను గుర్తించిన ఆదాయపన్ను శాఖ వివరణ ఇవ్వాల్సిందిగా ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా కోరింది. ఇందుకుగానుఫిబ్రవరి 15వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు హర్షి్వత
చింతూరు : మండలానికి చెందిన ఓ గిరిపుత్రిక అండర్ – 7 విభాగంలో జాతీయస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైంది. చింతూరులోని శాంతి స్కూల్లో రెండో తరగతి చదువుతున్న సున్నం హర్షి్వత నవంబరులో జరుగనున్న జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అర్హత సాధించింది. 8, 9 తేదీల్లో కృష్ణాజిల్లా నూజివీడులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానం సాధించడం ద్వారా హర్షి్వత జాతీయస్థాయికి ఎంపికైనట్టు తండ్రి సున్నం వెంకటరమణ తెలిపారు. హర్షి్వత, ఆమె సోదరి జోషిత కాకినాడలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవగా రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ – 7 విభాగంలో హర్షి్వత మూడోస్థానం, అండర్ – 14 విభాగంలో జోషిత ఆరో స్థానంలో నిలిచారు. -
జోరుగా వర్షాలు
జిల్లాలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదు సత్తుపల్లి, పినపాక, ముల్కలపల్లి మండలాల్లో కుండపోత ఖమ్మం వ్యవసాయం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాల్లో శనివారం మొదలైన వర్షాలు ఆదివారం నాటికి పుంజుకున్నాయి. ఆదివారం రోజున మూడు మండలాలు (ఎర్రుపాలెం, బోనకల్లు, ఇల్లెందు) మినహా అన్నిచోట్ల వర్షం కురిసింది. ఆదివారం ఉదయానికి జిల్లా సగటు వర్షపాతం 2.2 సెం.మీ.గా నమోదైంది. సత్తుపల్లి, పినపాక, ముల్కలపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. చండ్రుగొండ, వెంకటాపురం, దుమ్మగూడెం, భద్రాచలం, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. 14 మండలాల్లో సాధారణ స్థాయిలో, 13 మండలాల్లో అక్కడక్కడ వర్షం పడింది. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 7.82 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుంజుకున్న వర్షపాతం జిల్లాలో వర్షపాతం కొంతమేరకు పుంజుకుంది. ఏడు మండలాల్లో (పినపాక, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, ముల్కలపల్లి, సత్తుపల్లి) సాధారణానికి మించి (20 శాతానికి పైగా) వర్షపాతం నమోదైంది. 28 మండలాల్లో (వాజేడు, వెంకటాపురం, చర్ల, గుండాల, దుమ్ముగూడెం, పాల్వంచ, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూరు, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ముదిగొండ, వైరా, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం)లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో (సింగరేణి, చింతకాని, కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, నేలకొండపల్లి) ఇంకా లోటు వర్షపాతమే ఉంది. మొత్తంగా చూస్తే, సింగరేణి మినహా ఏజెన్సీ అంతటా వర్షపాతం సాధారణం.. అంతకున్నా ఎక్కువగా ఉంది. మైదాన ప్రాంతంలోని ఐదు మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. జలాశయాల్లోకి చేరుతున్న నీరు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది... ఇంకా చేరుతోంది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీటి రాక పెరుగుతోంది. సత్తుపల్లి మండలంలోని జలాశయాల్లోకి నీరు చేరుతోంది. ముల్కలపల్లి మండలంలోని ముత్యాలంపాడు వాగు ప్రవహిస్తోంది. మూకమామిడి ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వస్తోంది. దమ్మపేట మండలంలోని చెరువులు, కుంటలు నిండుతున్నాయి. వేంసూర్ మండలంలో దిద్దుపూడి వాగు ప్రవహిస్తోంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. కొత్తగూడెం మండలంలోని ముర్రేడు వాగు ప్రవహిస్తోంది. మణుగూరు, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం సాగులోగల పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి తదితర పైర్లకు ఈ వర్షాలు ఉపయోగపడతాయి. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (సెం.మీలలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– మండలం వర్షపాతం(సెం.మీ.లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– 6–9 సెం.మీల మధ్య వర్షపాతం నమోదైన మండలాలు సత్తుపల్లి 7.82 పినపాక 6.66 ముల్కలపల్లి 6.00 3–6 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైన మండలాలు పెనుబల్లి 5.34 చండ్రుగొండ 5.24 భద్రాచలం 4.94 దమ్మపేట 4.68 వెంకటాపురం 4.52 దుమ్ముగూడెం 4.52 వేంసూరు 3.30 కూసుమంచి 3.24 1–3 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైన మండలాలు కల్లూరు 2.88 అశ్వాపురం 2.80 ముదిగొండ 2.78 బూర్గంపాడు 2.46 పాల్వంచ 2.38 చర్ల 2.28 వాజేడు 2.22 నేలకొండపల్లి 1.92 అశ్వారావుపేట 1.88 కొత్తగూడెం 1.76 మణుగూరు 1.66 జూలూరుపాడు 1.28 ఏన్కూరు 1.02 గుండాల 1.00 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మూడు మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన 13 మండలాల్లో ఒక సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
రైతులకు అందుబాటులో ధరలు ఉండాలి
కోదాడ: వ్యవసాయ రంగంలో అధునిక పరికరాల వాడకం ఎక్కువగా ఉన్నపుడే రైతులు అధిక దిగుబడులు సా«ధిస్తారని కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జీ కె. శశిధర్రెడ్డి అన్నారు. యంత్రాల ధరలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు. కోదాడలో వీఎంసీ జాన్ఢీర్ ట్రాక్టర్ షోరూంలో కొత్త సీరిస్ ట్రాక్టర్ను ఆయన ప్రాంభించారు. కొత్త ట్రాక్టర్ ధర తక్కువ ఉండడం వల్ల రైతులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సురేష్కుమార్, కోదాడ డివిజన్ మేనేజర్ రామారావు, రాయపూడి వెంకటనారాయణ, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, లంకెల నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement