breaking news
Unanimous elected panchayats
-
ఏ జిల్లాలో ఎంతమంది ఏకగ్రీవమంటే..
సాక్షి, హైదరాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డుల సభ్యుల వివరాలను గురువారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 39 సర్పంచ్లు పోటీ లేకుండా ఎన్నిక కాగా, ఆ తర్వాత జాబితాలో వరుసగా... ఆదిలాబాద్ జిల్లాలో 166 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నోటిఫై చేయగా 33 చోట్ల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 184 స్థానాలకు 29, నల్లగొండ జిల్లాలో 318 స్థానాలకు 22, యాదాద్రి భువనగిరి జిల్లాలో 153 సర్పంచ్లకు 16, సిద్దిపేటలో 163 స్థానాలు 16, నిర్మల్లో 136 స్థానాలకు 16, మెదక్ జిల్లాలో 160 స్థానాలకు 16 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి.జోగుళాంబ గద్వాల జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు 15, భద్రాద్రి కొత్తగూడెంలో 159 స్థానాలకు 14, నాగర్ కర్నూల్లో 151 స్థానాలకు 14, నారాయణపేట జిల్లాలో 67 పంచాయతీలకు 14, వరంగల్ జిల్లాలో 91 స్థానాలకు 11, కామారెడ్డిలో 167 స్థానాలకు 11, జనగామలో 110 స్థానాలకు 10 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.రాజన్న సిరిసిల్లలో 85 సర్పంచ్లకు 9, ములుగు జిల్లాలో 48 స్థానాలకు 9, మహబూబాబాద్లో 155 స్థానాలకు 9, జయశంకర్ భూపాలపల్లిలో 82 స్థానాలకు 9, సంగారెడ్డి జిల్లాలో 136 స్థానాలకు 7, సూర్యాపేట జిల్లాలో 159 సర్పంచ్లకు 7, కొమురంభీం జిల్లాలో 114 స్థానాలకు 7, మంచిర్యాల జిల్లాలో 90 స్థానాలకు 6, రంగారెడ్డి జిల్లాలో 174 స్థానాలకు 6చోట్ల, వనపర్తిలో 87 సర్పంచ్లకు 5, హనుమకొండ జిల్లాలో 69 స్థానాలకు 4, జగిత్యాలలో 122 స్థానాలకు 4, పెద్దపల్లిలో 99 స్థానాలకు 4, కరీంనగర్ జిల్లాలో 92 సర్పంచ్లకు 3 స్థానాల్లో పోటీలేకుండా ఎన్నికయ్యారు.ఏకగ్రీవ వార్డులు ఇలా...ఆదిలాబాద్లో అత్యధికంగా 953 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా... ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 2,198 వార్డులకు 652 మంది పోటీ లేకుండా గెలిచారు. ఇక వరుసగా చూస్తే... నిజామాబాద్ జిల్లాలో 1,642 వార్డులకు 575, నిర్మల్ జిల్లాలో 1,072 వార్డులకు 471 మంది, కామారెడ్డిలో 1,520 వార్డులకు 433 మంది, నల్లగొండ జిల్లాలో 2,870 వార్డుసభ్యులకు 375 మంది, జగిత్యాల జిల్లాలో 1,172 వార్డులకు 349, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,436 వార్డులకు 336, మెదక్లో 1,402 వార్డులకు 332 మంది చోట్ల పోటీ లేకుండా ఎన్నికయ్యారు.ఖమ్మం జిల్లాలో 1,740 వార్డులకు 323 మంది, కరీంనగర్ జిల్లాలో 866 స్థానాలకు 276, మంచిర్యాలలో 816 వార్డులకు 268, మహబూబాబాద్లో 1,338 స్థానాలకు 266, మహబూబ్నగర్ జిల్లాలో 1,188 వార్డులకు 264, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,286 వార్డులకు 243, జనగామలో 1,024 వార్డులకు 228, రాజన్న సిరిసిల్లలో 748 వార్డులకు 227, సిద్దిపేట జిల్లాలో 1,432 వార్డులకు గాను 224, వరంగల్లో 800 స్థానాలకు 215 చోట్ల, పెద్దపల్లి జిల్లాలో 896 వార్డులకు 211 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చదవండి: మూడు తరాల సర్పంచ్లునారాయణపేట జిల్లాలో 572 వార్డులకు 210, నాగర్కర్నూల్లో 1326 వార్డులకు 208, సూర్యాపేటలో 1,442 వార్డులకు 198, రంగారెడ్డిలో 1530 వార్డులకు 190, హనుమకొండ జిల్లాలో 658 వార్డులకు 153, జయశంకర్ భూపాలపల్లిలో 712 స్థానాలకు 151, ములుగులో 420 వార్డులకు 128, సంగారెడ్డి జిల్లాలో 1,246 వార్డులకు 113, వనపర్తి జిల్లాలో 780 వార్డులకు 104, జోగుళాంబ గద్వాలలో 974 వార్డులకు 79 చోట్ల పోటీ లేకుండా ఎన్నికయ్యారు.ఉపసర్పంచ్ ఎన్నికకు...ఏదైనా గ్రామపంచాయతీలోని వార్డులన్నీ ఏకగ్రీవమైన పక్షంలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజునే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, డీపీఓలు, ఎంపీడీఓలకు ఎస్ ఈసీ సూచించింది. దీనికి సంబంధించి ముందుగా జిల్లా కలెక్టర్ల నుంచి ‘నిరభ్యంతర సర్టిఫికెట్’ తీసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయాలని తెలిపింది. కొన్ని గ్రామపంచాయతీల్లో ఒకటి, రెండు వార్డుల్లోనూ ఎన్నికలు జరగాల్సి ఉంటే, ఆ ఎన్నిక పూర్తయ్యాక ఓట్లు లెక్కించాక ఉప సర్పంచ్ ఎన్నికను చేపట్టాలని పేర్కొంది. -
6 పంచాయతీలు ఏకగ్రీవం
అనంతపురం: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్కు ముందే ఆరుగురు సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ రోజైన గురువారం ఆయా పంచాయతీలకు నామినేషన్లు వేసిన వారిలో పలువురు ఉపసంహరించుకోగా.. ఆరు పంచాయతీల్లో మాత్రం ఒక్కో నామినేషనే మిగిలింది. దీంతో కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్గా శుభలేఖ, గాండ్లపెంట మండలం జీపీ తండా సర్పంచ్గా భూక్యా రవీంద్రనాయక్, నల్లమాడ మండలం కొండకింద తండా సర్పంచ్గా డుంగావత్ పార్వతి, బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్గా విజయకుమారిబాయి, కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి సర్పంచ్గా హరిత, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి సర్పంచ్గా లీలావతి ఏకగ్రీవమయ్యారు. అలాగే తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న పలు పంచాయతీల్లోని వార్డు స్థానాలు కూడా ఏకగ్రీమయ్యాయి. ఆయా పంచాయతీల్లోని వారంతా కలసికట్టుగా గ్రామాల అభివృద్ధికి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు స్వాగతించారు. కాగా తొలివిడతలో కదిరి డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో 169 పంచాయతీలు, 1,714 వార్డు స్థానాలకు ఈనెల 9న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ గురువారం ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులను పంచాయతీల వారీగా అధికారులు ధ్రువీకరించారు. సర్పంచ్ బరిలో 462 మంది తొలి విడతలో 163 పంచాయతీలకు ఎన్నికలు జరVýæనుండగా 462 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని మొత్తం 1,714 వార్డులుండగా..715 వార్డులు ఏకగ్రీవమయ్యారు. తక్కిన 987 వార్డులకు 2,030 మంది బరిలో నిలిచారు. గుర్తులు కూడా కేటాయించడంతో చాలా మంది గురువారమే ప్రచారం చేయడం కనిపించింది. కాగా కదిరి డివిజన్ పరిధిలోని పంచాయతీలకు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల నిర్వహణ సామగ్రిని తరలించనున్నారు. కదిరి నియోజకవర్గంలో రెండు కదిరి అర్బన్/గాండ్లపెంట: తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న కదిరిలో నామినేషన్ల ఉపసంహరణ రోజు రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కదిరి మండలంలోని ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్గా బరిలో నిలిచిన వలంటీర్ నారిక శుభలేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానానికి శుభలేఖతో పాటు మానస, గౌతమి, నారాయణమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే గురువారం మిగతా ముగ్గురూ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నారిక శుభలేఖ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక గాండ్లపెంట మండలం తుమ్మలబైలు తండా సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయగా, గురువారం ముగ్గురు ఉపసంహరించుకోవడంతో బి.రవీంద్రనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటరి్నంగ్ అధికారి లక్ష్మీప్రియ ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన శుభలేఖ, బి.రవీంద్రనాయక్లను ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి అభినందించారు. పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నాలుగు పుట్టపర్తి: నియోజకవర్గంలో నాలుగు పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నల్లమాడ మండలం కొండకింద తండా సర్పంచ్గా పార్వతీ, బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్గా విజయకుమారిబాయి, కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి సర్పంచ్గా పాటిల్ హరిత, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి సర్పంచ్గా లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అభినందించారు. విజయకుమారిని వరించిన అదృష్టం బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్ స్థానానికి ఇద్దరు నామినేషన్ వేయగా.. గురువారం ఓ అభ్యరి్థని నామినేషన్ ఉపసంహరించుకోగా.. విజయకుమారిబాయి ఏకగ్రీవమయ్యారు. పుట్టపర్తి మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలుకాగా, సరస్వతి గురువారం నామినేషన్ ఉపసంహరించుకోగా.. లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. -
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలేవీ?
జంగారెడ్డిగూడెం రూరల్: ఎన్నికల ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రోత్సాహక నిధులను ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవ పంచాయతీల్లో 15వేల లోపు జనాభా ఉంటే రూ. 15 లక్షలు, 15వేల జనాభా దాటితే రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన ఏకగ్రీవ పంచాయతీలకు నిరాశే ఎదురైంది. వాటికి ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. 2013 జూలై 27నగ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 17 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులను అందజేయడంపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ కనబరచడం లేదు. జంగారెడ్డిగూడెం డివిజన్లో జంగారెడ్డిగూడెం మండలంలో అమ్మపాలెం, పుట్లగట్లగూడెం, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, దొరమామిడి, కోయ రాజమండ్రి, ముంజులూరు, కొయ్యలగూడెం మండలంలో అచ్యుతాపురం, డిప్పకాయలపాడు, పోలవరం మండలంలో గెడ్డపల్లి, ఎల్అండ్డిపేట, మామిడిగొంది, వింజరం, చింతలపూడి మండలంలో నామవరం, కామవరపుకోట మండలంలో కెఎస్ రామవరం, పోలాసిగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమయ్యాయని డివిజన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. తమ గ్రామాలకు ప్రోత్సాహక నిధులను వెంటనే మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయా పంచాయతీల పాలకవర్గాలు కోరుతున్నాయి.


