breaking news
Ujjain mahankali
-
బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
బన్సీలాల్పేట్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అమ్మవారి బోనాల వేడుకలను నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఫి షరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. అమ్మవారి ఘటం తయారీ వస్తువులు, ఆభరణాలను ఫౌండర్ ట్రస్టీ ఫ్యామిలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల వేడుకల సందర్భంగా ఆ లయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవా దాయ, పోలీసు, జీహెచ్ఎంసీ, విద్యుత్తు, సాంస్కృతిక, రవాణా, వైద్య ఆరోగ్య విభాగాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ కమిష నర్ వెంకట్రావు, ఈవో మనోహర్ రెడ్డి ఉన్నారు.డప్పుల దరువులకు స్టెప్పులేసిన పొన్నం..మంత్రి పొన్నం ప్రభాకర్ డప్పు చప్పుళ్లకు ఆనందంతో పోతురాజుల ఈరగోళలను తీసుకొని నృత్యం చేశారు. మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. అంతకు ముందు అమ్మవారి ఆలయాన్ని శ్రీ విద్యా శంకర భారతి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారి ఘటం ఉత్సవాల ఎదుర్కొలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సనత్నగర్ కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ కోట నీలిమ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ల స్కాముల బంధం గట్టిది: ప్రధాని
Updates: 12:36PM, Mar 5th, 2024 ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్రెడ్డి ప్రధానికి వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రెండురోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ 12:26PM, Mar 5th, 2024 బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య స్కాముల బంధం గట్టిది: ప్రధాని తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలు చూసి ప్రజలు కాంగ్రెస్కు అవకాశమిచ్చారు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కుంభకోణాల బంధం బలంగా ఉంది కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకుంటే విచారణ పేరుతో కాంగ్రెస్ దోచుకుంది. కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది కాంగ్రెస్ సర్కారు ఆటలు ఎక్కువ కాలం సాగవు మోదీ సర్కారులో ఎయిర్ దాడులు కూడా ఉంటాయి 12:10PM, Mar 5th, 2024 కుటుంబవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా : ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయి. కుటుంబవాద పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు పరివార వాదులకు చోరీ చేసేందుకు లైసెన్స్ ఉందా వాళ్లకు కుటుంబం ఫస్ట్... నాకు దేశం ఫస్ట్ కాంగ్రెస్ బయటివారికి ఎవరికీ అవకాశం ఇవ్వదు కుటుంబవాదులు సొంత ఖజానా నింపుకున్నారు. మోదీ దేశఖజానా నింపాడు నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కుటుంబవాదులు మోదీపైనే దాడి చేస్తున్నారు దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే ఇందుకు అందరూ మోదీకా పరివార్ అని అంటున్నారు నేను మోదీ కుటుంబం అని తెలంగాణ ప్రజలంటున్నారు తెలంగాణప్రజల కలలు.. నా సంకల్పం ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసుఘె ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది ఇవాళ రెండోరోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషం సంగారెడ్డి నుంచి రూ. 7వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నాం ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది పదేళ్లలో దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య రెట్టింపు అయింది వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దేశంలో తొలి ఎవియేషన్ సెంటర్ను బేగంపేటలో ఏర్పాటు చేశాం ఘట్కేసర్- లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ ప్రారంభించాం పటాన్చెరులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమాలు NH-65 లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణ (1,298 కోట్లు) NH-765Dలో 399 కోట్లతో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ NH-765Dలో 500 కోట్లతో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (b) పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు NH-161 లోని కంది - రామసానిపల్లె సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి (1,409 కోట్లు) NH-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ (323 కోట్లు) హైదరాబాద్, సికింద్రాబాద్ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ - II ప్రాజెక్ట్ (1,165 కోట్లు) ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం తక్కువ చార్జీలకే హైదరాబాద్ ప్రయాణ సౌకర్యం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది ఘట్కేసర్-లింగంపల్లి మధ్య అందుబాటులోకి కొత్త ఎంఎంటీఎస్ ఇవాళ రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసింది. తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం రూ. 33 వేల కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం రూ. 35 వేల కోట్లు. రేషన్ సబ్సిడీపై రూ. 30 వేల కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 26,728 కోట్లు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం రూ. 10,998 కోట్లు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10 వేల కోట్లు. సర్వశిక్షా అభియాన్ కింద రూ. 7,500 కోట్లు. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం రూ. 7,200 కోట్లు రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం రూ. 6,338 కోట్లు. ఎల్పీజీ సబ్సిడీ కింద రూ. 5,859 కోట్లు హెల్త్ మిషన్ కింద రూ. 5,550 కోట్లు. ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం రూ. 4,500 కోట్లు స్వచ్ఛ భారత్ కింద రూ. 3,745 కోట్లు.. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వడం లేదంటూ బురదజల్లుతోంది. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారు. 11:00AM, Mar 5th, 2024 పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10:40AM, Mar 5th, 2024 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మోదీ 10:30AM, Mar 5th, 2024 ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరిన ప్రధాని మోదీ 10:20AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు ప్రధాని మోదీ పూజలు చేసే సమయంలో ఆలయం లోపలికి ఇద్దరికి మాత్రమే అనుమతి దేవాలయం చుట్టూ వెయ్యిమంది పోలీసులతో సెక్యూరిటీ అమ్మవారి దర్శనం అనంతరం బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని #WATCH | Telangana: Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad. pic.twitter.com/zijxd4LYAX — ANI (@ANI) March 5, 2024 10:06AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ప్రధాని 9:50AM, Mar 5th, 2024 కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు తెలంగాణ పర్యటన షెడ్యూల్ రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి పఠాన్ చెరువు బయలుదేరనున్న ప్రధాని పఠాన్ చెరువులో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని పఠాన్ చెరువు బహిరంగ సభలో మాట్లాడనున్న ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి.. భారీగా బందోబస్తు ప్రధాని సభ కోసం పటాన్చెరులోని పటేల్గూడ సభా వేదిక వద్ద 23 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లు, కాషాయ జెండాలతో నింపేశారు. అధికారిక కార్యక్రమాల కోసం ఒకటి, రాజకీయ ప్రసంగం కోసం మరొకటి.. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని ముందుగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత బహిరంగ సభా వేదికపై ప్రసంగిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్సభ సీట్లతోపాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాలివీ.. ► రూ.1,298 కోట్లతో ఎన్హెచ్–65పై సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరణ ► రూ.399 కోట్లతో ఎన్హెచ్–765డిపై మెదక్–ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే విస్తరణ. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రూ.3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్– హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ ► రూ.400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ► రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్హెచ్–161లోని కంది–రామసానిపల్లె సెక్షన్లో 4 వరుసల జాతీయ రహదారి ► రూ.323 కోట్ల ఖర్చుతో చేసిన ఎన్హెచ్–167 మిర్యాలగూడ–కోదాడ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ ► రూ.1,165 కోట్లతో హైదరాబాద్–సికింద్రాబాద్లలో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టు. ► ఘట్కేసర్– లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం -
అమ్మవారి బోనం అపురూపం
హైదరాబాద్: 203 ఏళ్ల ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం. ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న అమ్మవారి బోనాల జాతరలో సమర్పించేందు కు బంగారు బోనాన్ని తయారుచేయిస్తున్నారు. బోనం తయారీ టెండర్ను దక్కించుకున్న మా నేపల్లి జువెలర్స్ ఇప్పటికే 94 శాతం పనులను పూర్తి చేసింది. అమ్మవారికి చేయించిన బంగారు బోనం ఎంతో అద్భుతంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం మానేపల్లి జూవెలర్స్లో బోనం తయారీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారికి వినియోగించకుండా ఉన్న నగలను కరిగించి బోనం తయారు చేయాలని ఆలోచించి.. దాన్ని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. వారు వెంటనే దీనికి ఒప్పుకుని ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 8.30 గంటలకు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బంగారు బోనాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర ణ్రెడ్డికి అందచేస్తారని తెలిపారు. నిజామా బాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఇంద్రకరణ్రెడ్డి అందిస్తారని, అక్కడి నుంచి 2 వేల మంది లలితాపారాయణ సత్సంగ్ సభ్యులు, మహిళల ఆధ్వర్యంలో బోనాలతో అమ్మవారి దేవాలయానికి ర్యాలీగా బయలుదేరుతారని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బంగారు బోనం అమ్మవారికి సమర్పించనున్నామని వివరించారు. బోన భాగ్యం అన్ని ఆభరణాల మాదిరిగా కార్ఖానాల్లో కాకుండా అమ్మవారి సన్నిధిలోనే బంగారు బోనం తయారు చేస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే పనులకు ఆటంకం కలగడంతోపాటు నియమనిష్టలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో గోప్యంగా ఉంచారు. - దేవాలయానికి చెందిన 3 కిలోల 80 గ్రాముల బంగారాన్ని కరిగించి ఈ బోనం తయారు చేస్తున్నారు. అమ్మవారి బోనం, దానిపై కలశ చెంబు, దీప ప్రమిద ఉంటుంది. - ఈ నెల 15న బోనం తయారీ పని మొదలైంది. 10 మంది నియమనిష్టలతో దీన్ని తయారుచేస్తున్నారు. - ఈ బోనంపై దేవాలయంలోని గర్భగుడిలో ఉండే మహంకాళి, మాణిక్యాలమ్మల మాదిరే బొమ్మలను తీర్చిదిద్దారు. ఈ బోనంపై 280 వజ్రాలను పొదిగి మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. - బంగారు ఆభరణాల తయారీకి యంత్రాలను వాడతారు. అమ్మవారి బోనం కావడంతో దీన్ని మొత్తం చేతిపనితోనే తయారు చేస్తున్నారు. రసాయనాలను వాడడంలేదు. కోట్ల వ్యాపారంలో లేని సంతృప్తి ఈ బోనాల్లో అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారని తెలిసి ప్రపంచవ్యాప్తంగా దీని కోసం ఆసక్తిగా భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మవారి భక్తులమైన మా కుటుంబానికి ఈ బంగారు బోనం తయారు చేసే పనులు దక్కడం అమ్మవారి కృపతోనే సాధ్యమైంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. కోట్ల రూపాయల వ్యాపారంలో లేని సంతృప్తి ఈ బోనం తయారీలో మా కుటుంబానికి దక్కింది. – మానేపల్లి మురళీకృష్ణ -
బోనాల తూప్రాన్
ఉజ్జయిని మహంకాళి పండగ కోసం భారీగా ఏర్పాటు ∙పోతరాజులకు, బ్యాండు మేళాలకు పెరిగిన డిమాండ్ ∙పెరిగిన ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కమిటీలు తూప్రాన్ : గ్రామీణ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాల తీరే వేరు. సంబరాలు అంబరాన్ని అంటేలా కార్యక్రమాలు జరుగుతాయి. చిన్నా,పెద్దా, ఆడామగ అంతా వేడుకల్లో పాలుపంచుకుంటారు. ఈక్రమంలో అమ్మవారికి సమర్పించే తొట్టెల కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించేందుకు కొన్ని నెలలుగా యువకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పోతరాజులు, బ్యాండు, న్యత్యకారులు, దేవాతమూర్తుల విగ్రహాల ప్రదర్శనకు అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ప్రస్తుతం పల్లెలకూ పాకింది. అ యితే, ఏటా ఖర్చులు పెరుగుతున్నాయని యు వకులు వాపోతున్నారు. అయినా, కార్యక్రమా లు అదిరిపోయేలా చేస్తామని చెబుతున్నారు. పట్టణంలో డీజేలకు క్రేజ్ జిల్లావ్యాప్తంగా ఏటా తూప్రాన్ మండల కేంద్రంలో బోనాలు మూడు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆరేళ్ల క్రితం డీజే సౌండ్ సిస్టంతో మహిళ డ్యాన్సుర్లు ఆడేవారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలపడంతో బ్యాండు మేళాలలకు క్రేజ్ పెరిగింది. స్టార్వార్స్ యూత్, ఛత్రపతి యువసేన, జయరాం యూత్, భజరంగ్బళి యువసేన, సాయి యూత్, కాణిపాక యూత్ తదితర యూత్ సభ్యులు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గతంలో పట్టణంలో దాదాపు 15 తొట్టెల కార్యక్రమాలు జరగగా.. ఈసారి మరో ఏడు పెరగవచ్చని యువకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, బోనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని వారు చెబుతున్నారు. సికింద్రాబాద్తో పాటు తూప్రాన్లో... హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ముగిసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం అనవాయితీ. కానీ, ఈ ఏడు సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల రోజునే తూప్రాన్లో అంటే ఈనెల 31న నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో ఘనంగా తొట్టెల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్న యువకులు ఆందోళన చెందుతున్నారు. ఒకే రోజున సికింద్రాబాద్, తూప్రాన్లో నిర్వహిస్తుండంతో బ్యాండు మేళాలు, నృత్యాకారులకు డిమాండ్ ఏర్పడింది. గతంలో కంటే రెండింతలు ఎక్కవగా డిమాండ్ చేస్తున్నారని వారు తెలిపారు. ఖర్చులు ఇలా... బోనాల ఉత్సవాల కోసం యువకులు కమిటీగా ఏర్పడి రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. బ్యాండు కోసం రూ.40 వేల నుంచి రూ.60 వేలు, పోతరాజులు, శివసత్తుల కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు, నృత్యకారులు ఒక్కొక్కరికీ రూ.1,500, దేవాతామూర్తుల విగ్రహల ప్రదర్శన కోసం విగ్రహనికి డిమాండ్ను బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లిస్తున్నారు. ఎక్కువ ధరలు బోనాల సందర్భంగా మార్కెట్లో బ్యాండుమేళాలు, పోతరాజులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వారు ధరలు ఒక్కసారిగా పెంచేశారు. అమ్మవారికి ఘనంగా తొట్టేల సమర్పించాలకున్నా.. పెరిగిన ధరలు ఇబ్బందిగా ఉన్నాయి. – సాయిప్రకాశ్, ఛత్రపతి యువసేన ఇబ్బంది పడుతున్నాం పోతరాజులు, బ్యాండు మేళాలు మార్కెట్లో దొరకడంలేదు. హైదరాబాద్లో పండగ ఉండటంతో వారికి డిమాండ్ ఏర్పాడింది. డబ్బులు ఎంత ఖర్చు చేద్దామనుకున్న ఫలితం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. – తరుణ్, స్టార్వార్స్ యూత్ అసోసియేషన్ ఘనంగా నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం బోనాల రోజున అమ్మవారికి తొట్టెలు నిర్వహిస్తున్నాం. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అందరికీ అడ్వాన్సులు ఇచ్చేశాం. ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా, కార్యక్రమాలు ఘనంగా చేస్తాం. – శివసాయి, భజరంగ్దల్ యూవసేన -
మహంకాళి అమ్మవారికి మంత్రి పూజలు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆదివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పూజలు చేశారు. అమ్మ వారికి మొదటి బోనం జోగిని శ్యామల సమర్పించింది. మంత్రితోపాటు రాంగోపాల్పేట్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ, ఈవో అన్నపూర్ణ ఉన్నారు. -
ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్.