breaking news
twety 20
-
టీ-20 మ్యాచ్లో దేశాలు దాటిన అభిమానం!
హరారే: భారత్-జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 క్రికెట్ మ్యాచ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు. హరారేలో జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో వైఎస్ఆర్సీపీ జెండాలు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ టీ షర్ట్లపై దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, యువనేత జగన్ మోహన్ రెడ్డి చిత్రాలను ధరించి తమ మద్దతు ప్రకటించారు. టీ-20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా దేశాలు దాటిన అభిమానాన్ని చాటుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హల్చల్ చేశారు. తాము విదేశాల్లో ఉన్నా.. తమకు వైఎస్ఆర్సీపీపై ఎనలేని అభిమానముందని చాటుకున్నారు. -
ధోని సేనకు షాక్
హరారే: జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు తొలి షాక్ తగిలింది. మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శనివారం జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. జింబాబ్వే విసిరిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోని సేన రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్ లో భారత విజయానికి ఎనిమిది పరుగులు చేయాల్సిన తరుణంలో మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సింగిల్స్ కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ తొలి బంతికి ధోని సింగిల్ తీయగా, ఆ తరువాత బంతికి అక్షర్ పటేల్ అవుటయ్యాడు. మూడో బంతికి సింగిల్ ధోని మరో సింగిల్ తీయగా, నాల్గో బంతికి రిషి ధవన్ పరుగేమీ చేయలేదు. ఐదో బంతి వైడ్ కావడంతో భారత్ కు ఒక పరుగు వచ్చింది. ఆ తరువాత ధవన్ సింగిల్ తీసి ధోనికి స్ట్రైయికింగ్ ఇచ్చాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని సింగిల్ తో సరిపెట్టుకున్నాడు. దీంతో భారత్ జట్టుకు ఓటమి తప్పలేదు. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తరువాత అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మన్ దీప్ సింగ్(31;27 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా, అంబటి రాయుడు(19) విఫలమయ్యాడు. దీంతో భారత జట్టు 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మనీష్ పాండే(48;35 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే మరో ఎండ్ లో అతనికి సరైన సహకారం లభించకపోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. భారత మిగతా ఆటగాళ్లలో కేదర్ జాదవ్(19), కెప్టెన్ మహేంద్ర సింగ్(19 నాటౌట్)లు నిరాశపరిచారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. జింబాబ్వే ఆటగాళ్లలో చిబాబా(20), మసకద్జా(25)లు మోస్తరుగా రాణించగా, ముతాంబామి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత సికిందర్ రాజా(20), వాలర్(30)లు ఫర్వాలేదనిపించారు. ఈ జోడీ మూడో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. అయితే చిగుంబరా (55 నాటౌట్; 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. టీమిండియా బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, రిషి ధవన్, అక్షర్ పటేల్, చాహల్ లకు తలోవికెట్ దక్కింది. -
టీ 20ల్లో భారత్ తొలిసారి..
హరారే:జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టీ 20 సిరీస్ ఆదిలోనే 'చెత్త' రికార్డును మూటగట్టుకుంది. టీ 20ల్లో మొదటి బంతికే వికెట్ ను కోల్పోయిన అప్రథను భారత్ తొలిసారి మూటగట్టుకుంది. మూడు టీ 20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లో 171 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఓపెనర్ కేఎల్ రాహుల్(0) వికెట్ ను నష్టపోయింది. ఇలా ఓ ఆటగాడు తొలి బంతికే నిష్క్రమిండం భారత టీ 20 చరిత్రలో ఇదే తొలిసారి. జింబాబ్వేతో వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం మ్యాచ్ లోనే భారత తరపున శతకం చేసిన ఓపెనర్ గా, బ్యాట్స్మన్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న కేఎల్ రాహుల్.. టీ 20 అరంగేట్రంలో మాత్రం డకౌట్ గా వెనుదిరగడం గమనార్హం.


