-
ఒపీనియన్ పోల్స్పై నిషేధం లేదు..
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు ముగిసే వరకూ మీడియాపై కొంత మేర నియంత్రణ అవసరమని పీఐబీ అడిషనల్ డైరెక్టర్ టీవీకే రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియలో మీడియా చాలా అవసరమని, రహస్య ఓటింగ్ ప్రాంతానికి మినహా అన్ని ప్రాంతాల్లో మీడియా వెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. ఇక 126 (ఏ) ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయరాదని, మొదటి దశ ఎన్నికలు ప్రారంభం అయిన తరువాత ఎగ్జిట్ పోల్స్పై నిషేధం.ఉంటుందని చెప్పారు. మిగిలిన ఎన్నికలపై అవి ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఓపీనియన్ పోల్స్పై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాకు సైతం ఎలక్ర్టానిక్, ప్రింట్ మీడియా మాదిరిగానే నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. అభ్యర్ధులు చివరి 48 గంటల్లో ఛానెల్స్ ద్వారా కూడా ప్రచారం చేయవద్దని కోరారు. పోలింగ్కు 48 గంటల ముందు వరకూ ఎలక్ర్టానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ప్రి సర్టిఫికేషన్ ఇవ్వాలని తెలిపారు. ఇక ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాకు వర్తించే నిబంధనలు సోషల్ మీడియాకు వర్తిస్తాయన్నారు. సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థి తన ఫేస్బుక్ ఖాతాకు సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలని టీవీకే రెడ్డి పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్.. క్విడ్ ప్రోకోలా వార్తలు ఉంటే పెయిడ్ న్యూస్గా పరిగణిస్తారని అన్నారు. పెయిడ్ న్యూస్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని చెప్పారు. పెయిడ్ న్యూస్ విషయంలో మీడియాకు ఎన్నికల కమిషన్ ఎలాంటి నోటీస్ ఇచ్చే అధికారం లేదని, ఎన్బీఏ, పీసీఐకి మాత్రమే అధికారాలుంటాయని స్పష్టం చేశారు. అభ్యర్థికి మాత్రమే ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చే అధికారం ఉందని చెప్పుకొచ్చారు. ఒకే వార్త వివిధ పత్రికల్లో ఒకే విధంగా ప్రచురిస్తే అది పెయిడ్ న్యూస్గా పరిగణిస్తారన్నారు. గత ఎన్నికల్లో 972 పెయిడ్ న్యూస్ కేసులు నమోదయ్యాయని, 2018 కర్ణాటక ఎన్నికల్లో 15 కేసులు నమోదయ్యాయన్నారు. -
పీఐబీ డైరెక్టర్గా టీవీకే రెడ్డి బాధ్యతల స్వీకరణ
అమరావతి : పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) విజయవాడ తొలి సంచాలకులుగా 1990 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(1990 బ్యాచ్)కు చెందిన తుమ్మ విజయకుమార్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో పత్రికా సమాచార కార్యాలయాన్ని బలోపేతం చేస్తూ పీఐబీ విజయవాడ కార్యాలయానికి నూతనంగా సంచాలకుల పోస్టును మంజూరు చేయటంతో పాటు టీవీకే రెడ్డిని ప్రభుత్వం నియమించింది. టీవీకే రెడ్డి గతంలో హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారిగా, ఫీల్డ్ పబ్లిసిటీ విభాగం ఏపీ,తెలంగాణ సంచాలకులుగా, పీఐబీ హైదరాబాద్ సంచాలకులుగా పనిచేశారు. ఆయన 25 సంవత్సరాల నుంచి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement