breaking news
tropical storms
-
జపాన్ను వణికిస్తున్న జంట తుఫానులు
టోక్యో: జపాన్ను జంట తుఫానులు వణికిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘మెక్ఖాలా', ‘హిగోస్’ అనే రెండు ఉష్ణమండల తుఫానుల కారణంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా శని, ఆదివారాల్లో ప్రయాణించాల్సిన కనీసం 120 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి.రద్దయిన సర్వీసులు.. నిలిచిన సైనిక విమాన ప్రయోగాలుజపాన్కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థలు ‘జపాన్ ఎయిర్లైన్స్’, ‘ఆల్ నిప్పన్ ఎయిర్వేస్’ ప్రధానంగా ఓకినావా, కాగోషిమా వంటి దక్షిణ ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేశాయి. గంటకు 108 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, భారీ వర్షాల వల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ వాతావరణ ప్రభావం వాణిజ్య విమానాలకే పరిమితం కాలేదు. అమెరికాతో కలిసి నిర్వహించాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలలో భాగంగా మియాకో ద్వీపానికి బయలుదేరాల్సిన ‘వీ-22 ఓస్ప్రే’ సైనిక రవాణా విమానం తొలి ప్రయాణాన్ని కూడా రక్షణ శాఖ వాయిదా వేసింది.అరుదైన ‘ఫుజివారా ఎఫెక్ట్’.. ఊహించని ముప్పువాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ రెండు తుఫానుల వల్ల అత్యంత అరుదైన ‘ఫుజివారా ఎఫెక్ట్’ ఏర్పడే అవకాశం ఉంది. రెండు తుఫానులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ కలిసి ప్రయాణిస్తాయి. దీనివల్ల తుఫానుల ఖచ్చితమైన దిశను, వేగాన్ని, తీవ్రతను అంచనా వేయడం అత్యంత కష్టతరంగా మారుతుంది. తైవాన్లో ఇప్పటికే ఇద్దరి ప్రాణాలను బలితీసుకుని, 88 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేసిన ‘మెక్ఖాలా’ తుఫాను బలహీనపడినప్పటికీ, ఈ అరుదైన వాతావరణ ప్రక్రియ వల్ల జపాన్లోని ఒసాకా, నాగోయా, టోక్యో వంటి ప్రధాన నగరాలకు భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. 10 లక్షల మందికి హెచ్చరికలు.. వరద గుప్పిట్లో నగరాలుతుఫానుల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు ఆదేశించారు. కాగోషిమా ప్రాంతంలో ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలు నీట మునిగాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒసాకా, క్యోటో నగరాల్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: కంగారు లేని ప్రయాణం.. మనసుకు నచ్చిన నిశ్శబ్దం! -
మహా ప్రళయం! జంగ్మీ తుఫాను రౌద్రరూపం.. గాలిలో ఎగిరిపడుతున్న కార్లు!
-
ఫిలిప్పీన్స్లో వరదలు.. 23 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్ ఈశాన్య ప్రాంతాన్ని ట్రామి తుపాను అతలాకుతలం చేస్తోంది. బికోల్ ప్రాంతంతోపాటు క్వెజాన్ ప్రావిన్స్లో నీట మునిగిన ఘటనల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగా నగరంలోనే ఏడుగురు చనిపోయారు. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే నమోదైందని అధికారులు తెలిపారు. ఆల్బే ప్రావిన్స్లో మయోన్ అగ్ని పర్వతం నుంచి వెల్లువెత్తుతున్న బురద ప్రవాహం అనేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది. ఇళ్లపైకి చేరిన వారిని, వరదలో చిక్కుకున్న వారిని యంత్రాంగం మోటారు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ట్రామి తుపానుతో 75,400 మంది నిరాశ్రయులయ్యారని మొత్తం 20 లక్షల మందిపై ప్రభావం చూపిందని ప్రభుత్వం తెలిపింది. బుధ, గురు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. చాలా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సాయం అందించడం కూడా కష్టంగా మారిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది. -
బంగ్లాదేశ్ ను వణికిస్తున్న వరదలు...
ఢాకా: బంగ్లాదేశ్ లో తలెత్తిన వరదల వల్ల దాదాపు 33 మందికి పైగా మృతిచెందారని అధికారులు తెలిపారు. గురువారం సంభవించిన ఈ వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. దీంతో బంగ్లా అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రారంభించారు. వాయవ్య బంగ్లాదేశ్ లో ఈ వరదల ప్రభావం ఎక్కువగా కనిపించింది. పబ్నా, రాజ్ సాహి, సిర్జ్ గంజ్, బ్రాహ్మణ్ బారియా జిల్లాల్లో కనీసం 19 మంది చనిపోయి ఉంటారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. రాజధాని ఢాకాలో వర్షంలో ఫుట్ బాల్ ఆడుతున్న ముగ్గురు విద్యార్థులపై పిడుగు పడగా ఆస్పత్రికి తరలించామని స్టేషన్ ఆఫీసర్ కాసీర్ అహ్మద్ చెప్పారు. చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వరదల వల్ల సంభవించిన నష్టం కంటే పిడుగు పాటు వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని అహ్మద్ వివరించారు. ప్రతి ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య వచ్చే రుతుపవనాలకు ముందుగా బంగ్లాదేశ్ లో వరదలు సంభవిస్తూనే ఉంటాయన్న విషయం తెలిసిందే.


