-
ఎన్నాళ్లో వేచిన సమయం!
సీతంపేట శ్రీకాకుళం : సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలపై తరువాత కాలంలో అధికారులు ఎవరూ దృష్టిసారించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు చాలా సమస్యలతో ఇప్పటికీ సతమతమవుతున్నారు. నీటి కోసం అగచాట్లు ఐటీడీఏ పరిధిలో తాగునీటి సౌకర్యం లేని గ్రామాలు వంద వరకూ ఉన్నాయి. రక్షిత పథకాల నిర్మాణానికి నిధులు మంజూరైనా పూర్తిస్థాయిలో పనులు జరగని పరిస్థితి. దీంతో నీటి కోసం గిరిపుత్రులు గెడ్డలపై ఆధార పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. అందని వైద్యం.. గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు కూడా సక్రమంగా అందడం లేదు. అత్యవసర సమయాల్లో కూడా 108 వాహన సేవలు మృగ్యమౌతున్నాయి. ఫీడర్ అంబులెన్స్లు ఉన్నా కొండపై గ్రామాలకు వెళ్లలేకపోతుండడంతో సకాలంలో గిరిజనులకు వైద్యసేవలు అందడం లేదు. మరెన్నో సమస్యలు... రహదారులు లేని గ్రామాలు ఇప్పటికీ ఏజెన్సీలో చాలా ఉన్నాయి. గిరిజనలకు రహదారి, తాగునీటి సౌకర్యాల కల్పన పూర్తి స్థాయిలో కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అర్హులైన గిరిజనులకు సైతం గృహనిర్మాణ శాఖ ద్వారా నూతన ఇళ్లు మంజూరు లేదు. గతంలో నిర్మించిన ఇళ్లకు చాలా వరకు బిల్లులు ఇవ్వలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. నిధులు మంజూరైన నిర్మించలేకపోయారు! గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా ఐటీడీఏ టీపీఎంయూ విభాగం పరిధిలో ఏడు మండలాలకు 124 రహదారులు ఏడాది కిందట మంజూరయ్యాయి. అలాగే మరో 88 రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు మంజూయ్యాయి. అయితే ఇప్పటి వరకు పనులు మాత్రం పూర్తి చేయలేదు. జూలై నెలాఖరకు కొన్ని, ఆగస్టు 31వ తేదీ నాటికి మరి కొన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లేదంటే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అయినా ఫలితం లేదు. కనీసం 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. అలాగే చిన్ననీటి వనరుల ద్వారా చెక్డ్యాం పనులు కూడా పూర్తికాలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు జరిగినా అవి నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కొద్ది రోజుల కిందట టిటుకుపాయిగూడ, భామిని మండలం వడ్డంగి తదితర ప్రాంతాల్లో పాలకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పర్యటించి చెక్డ్యాంలను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని విషయాన్ని గుర్తించారు. నాసిరకం పనులపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేసినా ఫలితం లేదు. ఉపాధిహామీ పథకం పనులు చేసిన వారికి కూడా వేతనాలు చెల్లించలేదు. ఐటీడీఏ పరిధిలో ఉపాధి వేతన బకాయిలు సమారు రూ.10 కోట్లు ఉన్నాయి. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేతనదారులు కోరుతున్నారు. గిట్టుబాటు ధరలు నిల్ గిరిజనులు పండిస్తోన్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. గిరిజన సహకార సంస్థ ఉన్నా.. అన్నిరకాల వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి. కొండచీపుర్లు, చింతపండు వంటి వస్తువులను మాత్రమే జీసీసీ కొనుగోలు చేస్తున్నా..వారికి కూడా సరైన మద్దతు ధరలు కల్పించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కందులు, పసుపు, అల్లం, జీడి వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నామని గిరిపుత్రులు చెబుతున్నారు. వెంటాడుతున్న ఏనుగుల సమస్య ఏనుగుల సమస్య గిరిజనులను దశాబ్ద కా లంగా వెంటాడుతోంది. సుమారు 12 ఏనుగులు ఐటీడీఏ పరిధిలోని మండలాల్లోనే సంచరిస్తూ.. గిరిజనులకు చెందిన పంటలను, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. చాలామందిని పొట్టనపెట్టుకున్నాయి. అయినా ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధితులకు నష్ట పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిలో శనివారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగనుంది. అయితే గిరిజనుల సమస్యలపై సభ్యులు ఎలా స్పందిస్తారో.. ఏం మాట్లాడుతారో చూడాలి. -
'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు'
హైదరాబాద్: ‘రాబోయే కాలంలో బాక్సైట్ తవ్వమని, గిరిజనుల పక్షాన నిలబడతామని, పర్యావరణాన్ని కాపాడతామని శాసనసభలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి’ అని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలన్నారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇంకా ఆమె ఏమాట్లాడారంటే.. ► ఏజెన్సీలో ఉన్న సీహెచ్సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు), పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)ల్లో స్పెషలిస్టులు లేరు. వైద్యం కోసం నగరానికి వెళ్లడానికి డబ్బుల్లేక, గిరిజనులు వైద్యానికి దూరమవుతున్నారు. ► టీడీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లయింది. అటవీ శాఖ మంత్రి ఒక్కసారి కూడా తమ ప్రాంతాల్లో పర్యటించలేదు. వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు. ► ప్రాథమిక విద్య కూడా గిరిజనులకు అందకుండా పోతుంది. ప్రతి కిలోమీటరు ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే.. హేతుబద్దీకరణ పేరిట వాటిని తొలగించారు. వాగులు దాటి స్కూళ్లకు పోలేక విద్యార్థులు చదువు మానేస్తున్నారు. ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య పెరుగుతోంది. ► పాఠశాలల్లో మౌలిక వసతుల్లేవు. స్కూళ్లలో టాయిలెట్స్ లేవు. ఉన్నా ఉపయోగించే పరిస్థితిలో ఉండటం లేదు. విద్యావాలంటీర్ల శ్రమను ప్రభుత్వం దోచుకుంటోంది. నెలకు రూ. 5 వేల జీతంతో సరిపెడుతున్నారు. ► ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెన్షన్ భద్రత లేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనే విన్నపాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. తమిళనాడులో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ► గిరిజన గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఎన్టీఆర్ సుజల, జలసరి అడ్రస్ లేవు. ► అరకు మెయిన్ రోడ్డు నిండా గోతులే. ఇక గిరిజన గ్రామాల రోడ్ల పరిస్థితి చెప్పడానికి లేదు. ► గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి ఉంటే.. కనీసం పరిస్థితుల్లో కొంత మార్పు ఉండేది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెలే ఉన్నారనే ఉద్దేశంతో సలహా మండలిని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వంలో గిరిజన మంత్రీ లేకపోవడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement